అరుణాచల్ ప్రదేశ్ లోని చాంగ్లాంగ్ జిల్లలో ఉండే చిన్న పట్టణం బోర్డుమ్సా. 150 మీటర్ల ఎత్తున ఉండే బోర్డుమ్సా లో షుమారు 25,368 మంది జనాభా ఉంటారు. సింగ్ఫో అనే తెగవారి ప్రధాన నివాసకేంద్రం ఈ పట్టణం. టై-ఖమ్ప్తి, టై-ఖామ్యంగ్, టై-ఫకే అనే ఇతర తేగల వాళ్ళు కూడా ఈ పట్టణంలో ఉంటారు. ‘పెద్ద’ అనే అర్ధం వచ్చే ‘బోర్’ అనే పదం సింగ్ఫో జాతిలోని సంబోధనలలో ఒకటైన ‘దుమ్సా’ అనే పదం ఈ రెండిటి కలయికతో ఈ పట్టణానికి ఆ పేరు వచ్చింది.
అనేక తెగలకు చెందిన గిరిజనులు ఇప్పటికీ బోర్డుమ్సా లో కనిపిస్తారు, పైగా బోర్డుమ్సా చుట్టూ దుమ్స-గ్రామం, గాజు, గెలేన్జా, లలుంగ్, గిదింగ్, ఖేరేం లాంటి చాలా ప్రధానమైన గ్రామాలూ ఉన్నాయి. దైవభక్తి గల స్థానికులు హిందూ, గిరిజన ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొంటారు.
విస్తారమైన తేయాకు తోటలు, ;బౌద్ధ క్షేత్రాలతో బోర్డుమ్సా అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా మారింది. బోర్డుమ్సా లోని గోజు లో ఒక అందమైన బౌద్ధ మందిరం ఉంది. రద్దీగా ఉండే పట్టణ ప్రాంతంలో ఒక పెద్ద బౌద్ధ విగ్రహం కూడా ఉంది. ఇక్కడ తప్పక చూసితీరాల్సిన శివాలయం కూడా ఉంది.