తేజు అరుణాచల్ ప్రదేశ్ లోహిత్ జిల్లాలోని ఒక చిన్న పట్టణం. ఈ చిన్న పట్టణం అందమైన లోయలకు, నదులకు పేరుగాంచింది. ఈ లోయలు, నదులు మిష్మి తెగల పురాతన నివాసాలు. ఈ తెగలు మహాభారత కాలంనుండి ఉనికిలో ఉన్నాయి. శ్రీకృష్ణుని మొదటి భార్య రుక్మిణి మిష్మి తెగకు చెందిన సుందరిగా చెప్పబడుతుంది. తేజు ప్రజలు తమ్లడు పూజగా పిలువబడే మిష్మి పండుగను జరుపుకుంటారు, ఇది మిష్మి తెగకు ప్రధాన పండుగ. ఈ పండుగ ప్రతి ఏటా ఫిబ్రవరి 15 న జరుపుకుంటారు, ఈ ఉత్సవంలో అన్నిరకాల తెగల ప్రజలు పాల్గొంటారు. ఒక చిన్న పట్టణమైన తెజులో కొన్ని ముఖ్యమైన పర్యాటక ఆకర్షణలు కూడా ఉన్నాయి. ప్రధాన పర్యాటకాలలో కొన్ని పరశురాం కుండ్, భారతదేశం మొత్తం నుండి, సమీప దేశాల నుండి కూడా వేలమంది హిందూ యాత్రికులని ఆకర్షించే ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం.
పర్యాటకులు పవిత్ర స్నానం ద్వారా తమ పాపాలను పోగొట్టుకోవడానికి ఇక్కడికి వస్తారు. దీనిని అనుసరించడానికి ప్రతి సంవత్సరం జనవరి నెలలో తేజు వద్ద వేడుకను జరుపుకుంటారు. గ్లో సరస్సు, హవా కాంప్, హాట్ స్ప్రింగ్ కూడా ఇక్కడి ఇతర ఆకర్షణలు.
తేజు ప్రజలు
తెజు ప్రధానంగా లామా కాంప్ అనే స్థానిక పేరుతో పిలువబడే టిబెట్ కమ్యూనిటీ వారితోపాటు షుమారు 2000 మంది జనసాంద్రతను కలిగిఉంది. ఈ కాంప్ తేజు మార్కెట్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిన్దోలోంగ్ లో ఉంది, 5 శిబిరాలు ఉన్నాయి, ప్రధానంగా ఖం కొంగ్పో, పెమకో అని పిలువబడే టిబెట్ లోని వివిధ ప్రాంతాల వారు ఈ శిబిరాలను నిర్వహిస్తున్నారు.
ఈ ప్రజలు చైనీయులను వదిలించుకున్న తరువాత వారి స్వస్థలం టిబెట్ లో 1960 లో స్థిరపడ్డారు. ఇప్పటి వరకు తేజు ప్రజలు టిబెటన్ సంఘ స్వంత ఆచారాలను, సంప్రదాయాలను నిర్వహిస్తూ ఉన్నాయి, ప్రభుత్వ సహాయంతో, ఇతర వనరుల నుండి వస్తున్న నిధులతో ఆశ్రమాలు, ఆరోగ్య కేంద్రాలు, నర్సింగ్ హోమ్స్, స్కూళ్ళు మొదలైనవి నిర్మించారు.
తేజు చేరుకోవడం ఎలా
తేజు రోడ్డు, రైలు, వాయు మార్గాలద్వారా సులువుగా చేరుకోవచ్చు. తిన్సుకియ సమీప రైలు కేంద్రం. ఈ ప్రదేశానికి టాక్సీలు, బస్సులు ప్రధాన రవాణా సదుపాయాలు.
తేజు సందర్శనకు ఉత్తమ సమయం
డిసెంబర్ లో ప్రారంభమై ఫిబ్రవరి చివరి వరకు ఉండే శీతాకాల సమయంలో తేజు ని సందర్శించడం ఉత్తమం.