11 వ శతాబ్దం, 13 వ శతాబ్దం లో నిర్మించిన దిల్వార జైన దేవాలయాలు తప్పక చూడవలసిన పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ఈ దేవాలయాలు తెల్లటి పాలరాయితో అందంగా చెక్కారు. ఈ దేవాలయాలలో అధ్భుతంగా చెక్కిన ఐదు జైన దేవాలయాలు వున్నాయి, ఇవి మొత్తం రాజస్థాన్ లోని అత్యంత అందమైన దేవాలయాలుగా పేరు పొందాయి.
రాజస్థాన్ లోని ఐదు గ్రామాల పేరిట ఏర్పడ్డ ఈ దేవాలయాలు ఒక దాని నుండి మరొకటి పూర్తి భిన్నంగా ఉంటాయి. విమల్ వసహి దేవాలయం, లున వసహి దేవాలయం, పీతాల్ హర్ దేవాలయం, ఖర్తర్ వసహి దేవాలయం, శ్రీ మహావీర్ స్వామి దేవాలయం అనేవి ఈ ఐదు దేవాలయాలు. తమ తీర్థంకరులను (యోగులు) పూజించడానికి పెద్దసంఖ్యలో జైన భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. ఈ దేవాలయాల అధ్భుత నిర్మాణ శైలిని చూడడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు వస్తారు.ఈ దేవాలయాల గురించి మరింత తెలుసుకునేందుకు అద్దె చెల్లించి టూరిస్ట్ గైడ్ ల సేవలను పొందవచ్చు. మౌంట్ అబూ నుండి రెండున్నర కి. మీ. దూరంలో గల దిల్వార దేవాలయాలను రోడ్డు ప్రయాణం ద్వారా చేరవచ్చు.