భగవంతుడైన శివుని భక్తులు 123 అడుగుల ఎత్తుగల శివుడి విగ్రహం శివలింగంతో సహా ఈ దేవాలయంలో చూస్తారు. ఇంత పెద్దదైన విగ్రహాన్ని మురుడేశ్వర్ వెళ్ళేవారు తప్పక చూడాల్సిందే. దేవాలయ పరిసరాలలో చెక్కబడిన అనేక లిపులను కూడా పర్యాటకులు పరిశీలించవచ్చు. దీని రాజగోపురం 20 అంతస్తులతో ఉండి ప్రవేశం వద్ద రెండు పెద్ద ఏనుగులుంటాయి. దేవాలయాన్ని దక్షిణ భారత శిల్ప శైలిలో గ్రానైట్ రాయితో నిర్మించారు.
మురుడేశ్వర్ లో శివుడి విగ్రహం ఎవరు ఏర్పరచారు? మురుడేశ్వర్ సందర్శించేవారు అతిపెద్ద శివుని విగ్రహం తప్పక చూడాల్సిందే. ఈ విగ్రహం 123 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోని అతి పెద్ద విగ్రహాలలో ఒకటిగా చెప్పబడుతోంది. ఈ విగ్రహాన్ని నిర్మించేందుకు రెండు సంవత్సరాలకాలం పట్టింది. దీనిని ఆధ్యాత్మిక చింతనపరులు, వ్యాపార వేత్తలు అయిన ఆర్ ఎన్ శెట్టి ధనసహాయంతో, షిమోగా కు చెందిన కాశీనాధ్, ఆయన కుమారుడు శ్రీధర్ లు కలిసి నిర్మించారు.
ఈ దేవాలయంపై వ్యయం షుమారుగా 50 మిలియన్ రూపాయలుగా ఉందని తెలుపుతారు. ఈ విగ్రహాన్ని సూర్యుడి కిరణాలు నేరుగా తాకేలా నిర్మాణం చేశారు. మొదటిలో ఈ విగ్రహం నాలుగు చేతులతో ఉండేది. బంగారు పూత వేశారు. అయితే, బలమైన గాలులలకు ఒక చేయి విరిగిపోయింది. వర్షాలకు అతి సుందరమైన ఈ శివ విగ్రహం రంగు వెలిసింది.