మైసూర్ దర్శించే పర్యాటకులు హేపీ మేన్ పార్క్ తప్పక చూడాల్సిందే. చాలామంది పెద్దలు, పిల్లలు దీనిలో రిలాక్స్ అయ్యేందుకు ఇష్టపడతారు. దీనిలో ఒక మిని జూ ఉంటుంది. అనేక కోళ్లు, బాతులు వంటివి ఒక సరస్సులో ఈదులాడుతూంటాయి. సరస్సుపై ఒక చెక్క వంతెన కూడా ఉంటుంది. అన్నింటిలోకి ప్రధాన ఆకర్షణ అంటే, అందరికి నవ్వు పుట్టించే విధంగా హేపీ మ్యాన్ తన కుండ బొజ్జతో నిలబడి మైసూర్ ప్రజల అనారోగ్య ఆహారాలను తింటూ ఉంటాడు. వీనుల విందైన సంగీతం ఈ గార్డెన్ లో వినవచ్చు. జాగింగ్ ప్రియులకు సాయంత్రం 4.30 గంటలనుండి రాత్రి 9 గం. వరకు ఈ పార్క్ ఎంతో ఆనందం కలిగిస్తుంది.