మైసూర్ పట్టణంలోని మైసూర్ ప్యాలెస్ ను అంబా విలాస్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. మైసూర్ సందర్శించే పర్యాటకులు దీనిని తప్పక చూడవలసిందే. ప్యాలెస్ నిర్మాణంలో ఇండో సార్సెనిక్, ద్రవిడ, రోమన్, మరియు ప్రాచ్య దేశాల శైలి శిల్పకళా చాతుర్యాలు కనపడతాయి. మూడు అంతస్తులుకల ఈ ప్యాలెస్ నిర్మాణంలో మూడు మార్బుల్ గోపురాలకు గ్రే గ్రానైట్ ఉపయోగించారు. ప్యాలెస్ తో బాటుగా 44.2 మీటర్ల ఎత్తుగల అయిదు అంతస్తుల టవర్ కూడా నిర్మించారు. దీని గోపురాలు బంగారంతో తాపడం చేయబడ్డాయి. ఈ నిర్మాణం ప్రపంచంలోనే అత్యధిక సందర్శకులు వచ్చే ప్రదేశంగా చెప్పబడుతోంది. ప్రతిష్టాత్మక ఈ నిర్మాణాన్ని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఈ భూమి పై గల 31 తప్పక చూడవలసిన ప్రదేశాల జాబితాలో చేర్చింది. పర్యాటకులు ప్యాలెస్ లోకి అతి పురాతన అంటే 19వ మరియు 20వ శతాబ్దాల నాటి బొమ్మలు ఉన్నగొంబె తొట్టి అని పిలువబడే భవన సముదాయం ద్వారా ప్రవేశించాలి. ఇదే కాక, అక్కడ 81 కిలో గ్రాముల బంగారంతో అలంకరించబడిన ఒక చెక్క ఏనుగు అంబారి కూడా ఉంటుంది. గోంబె తొట్టి ముందర, ఏడు ఫిరంగులుంటాయి. ఈ ఫిరంగులను దసరా పండుగ వేడుకల ప్రారంభ మహోత్సవానికి పేలుస్తారు. ఈ పండుగలో 200 కిలోల బంగారు సింహాసనాన్ని ప్రజలకు ప్రదర్శిస్తారు. మైసూర్ మహారాజుల కుటుంబ సభ్యుల దుస్తుల గదులు, చిత్రపటాల గ్యాలరీ, ఆభరణాలు వంటివి కూడా చూడవచ్చు. ఈ రాజ భవనంలోని గోడలు సుమారు 14వ మరియు 20వ శతాబ్దాల మధ్య ప్రఖ్యాత చిత్రకారులు సిద్దలింగ స్వామి, రాజా రవివర్మ మరియు కె. వెంకటప్పలు రూపొందించిన పెయింటింగ్ ల చే అలంకరించబడ్డాయి.



Click it and Unblock the Notifications