నంది పట్టణం నుండి 7 కిలోమీటర్ల దూరంలో కల కనివే నారాయణపుర పట్టణాన్ని పర్యాటకులు తప్పక చూడాలి. ఇక్కడి అందమైన కొండలు, అంటే స్కందగిరి, బ్రహ్మగిరి, నంది హిల్స్, చన్న గిరి పర్యాటకులను ఆనందపరుస్తాయి. పరిశుభ్రత, శుభ్రమైన నీరు, వంటివి కనివేనారాయణపురలో సత్య సాయి బాబా ఫౌండేషన్ బాలలు అందిస్తున్నారు. ఇక్కడ ఒక స్కూలు, నీటి పారుదల విధానం, పార్కు, పరిశుభ్రత ఆరోగ్య జాగ్రత్తల సౌకర్యాలు, విశాలమైన ఇండ్లు, కమ్యూనిటీ హాలు మొదలైనవి నిర్మాణం చేస్తున్నారు. కనివేనారాయణపుర సారవంతమైన భూమి కలిగి ఉంది. ఇక్కడి నేలలో కొబ్బరి చెట్ల పెంపకం, సిల్క్, ద్రాక్ష మరియు యూకలిప్టస్ లు పండిస్తారు. భిన్న రకాల జాతుల మొక్కలకు నిలయం. స్ధానికుల మేరకు మహాత్మ గాంధీ నంది గ్రామానికి వెళ్ళేటపుడు ఇక్కడ బస చేశాడని చెపుతారు. కనివేనారాయణపుర సమీపంలోనే టిప్పు సుల్తాన్ వేసవి రాజభవనం కూడా కలదు.