శ్రీనాధ్ జీ దేవాలయం 12వ శతాబ్దానికి చెందిన పురాతన గుడి. దీనిలో శ్రీక్రిష్ణుడు ఉంటాడు. విగ్రహాన్ని నల్లని పాలరాతితో తయారు చేశారను. ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి తర్వాత ఈ దేవాలయం ధనవంతమైన దేవాలయంగా చెపుతారు. పర్యాటక భక్తులైతే, ఈ దేవాలయం తప్పక దర్శించి తీరాలి.
నాధ్ ద్వారాలోని కంకోళి గ్రామంలో కల ద్వారకాధీశ దేవాలయం పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. ఈ దేవాలయం వైష్ణవులు, వల్లభాచర్యులకు చెందినది. దీనిలో శ్రీక్రిష్ణుడు ఉంటాడు. ఈ విగ్రహాన్ని మధుర నుండి తెచ్చి ప్రతిష్టించారని చెపుతారు. పక్షుల సందర్శనలో ఆసక్తి కలవారు దేవాలయానికి...
రాజసమండ్ నాధ్ ద్వారాకు 15 కి.మీ.ల దూరంలో కలదు. ఈ పట్టణం రాజసమండ్ సరస్సు పక్కన కలదు. ఇది అందమైన మార్బుల్ మరియు హేండ్ లూమ్ ఉత్పత్తులకు ప్రసిద్ధి. ఈ ప్రదేశంలోనే కంరోళి డ్యామ్, కుంభాలఘర్ మరియు హల్దీ ఘాటిలను కూడా చూడవచ్చు.
నాధ్ ద్వారాలోని చార్ భుజ ఒక చిన్న పట్టణం. దీనిని గతంలో ఘర్ బోర్ అనేవారు. ఇక్కడ చార్ భుజాజీ దేవాలయం కలదు. విగ్రహం విష్ణుమూర్తి అవతారం. ఈ దేవాలయం శిల్పకళకు ప్రసిద్ధి. ఈ ప్రదేశం లోనే బోర్ రాజ్ పుత్రుల కోట కూడా కలదు.
నాధ్ ద్వారాలో షాపింగ్ ఆసక్తికరం. సాంప్రదాయకమైన వస్తువులు తక్కువ ధరలలో దొరుకుతాయి. పర్యాటకులు బహుమతులుగా ఇచ్చేందుకు పిచ్చవాయి పెయింటింగ్ లు కూడా కొనుగోలు చేయవచ్చు. టెర్రకోటా వస్తువులు ఎంతో ఆకర్షణీయం. ఈ కళలు సుమారు 2000 సంవత్సరాలనాటివి. అన్ని ఆర్ట్...