నవన్శాహర్ దానికి గల ప్రకృతి అందాలకు, చుట్టూ పట్ల ఆకర్షణలకు, ఆహ్లాదకర వాతావరణానికి గాను కాల క్రమేణా పంజాబ్ లో ఒక గొప్ప పర్యాటక స్థలం అయింది. ఇక్కడ సట్లేజ్ నది వుండటం ఆ ప్రాంత అందాన్ని, భూమిలోని సారాన్ని మరింత ఇనుమడింప చేసింది. నవన్శాహర్ ను గతంలో నౌసార్ అని ఒక ఆఫ్ఘన్ మిలిటరీ నేత నౌశార్ ఖాన్ పేరుతో పిలిచేవారు. దీనిని అతడు అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనలో నిర్మించాడు. 2008 సంవత్సరంలో పంజాబ్ ముఖ్య మంత్రి ఎస్. ప్రకాష్ సింగ్ బాదల్ అధికారికంగా దీని పేరును నవాన్ సహర్ నుండి షహీద్ భగత్ సింగ్ నగర్ కు మార్చారు.
నవాన్శాహర్ లోని పర్యాటక ప్రదేశాలు
నవాన్సహర్ లోని మియు చుట్టూ పట్ల కల ఆకర్షణలు చూడటానికి సందర్శకులకు కొన్ని రోజులు పడుతుంది. అన్నింటిలోకి ప్రధానమైనది అయిదు కోటలు లేదా హవేలీలు. వీటిని నౌష ఖాన్ నిర్మించాడు. ఇక్కడ ప్రసిద్ధ గురుద్వారాలు కూడా కలవు. గురుద్వారా ననక్సర్, గురుద్వారా గుర్పర్తప్, సంచి టెంపుల్ నవన్శాహర్, నాఅభ్ కన్వాల్, కిర్పాల్ సాగర్ మియు గురుద్వారా గుర్పలా పేరొందినవి. పర్యాటకులు నవాన్శాహర్ లోని ఆకర్షనలే కాక, చుట్టుపట్ల వున్నా జలంధ, లూధియానా, హోషియార్పూర్ మరియు సిమ్లా వంటి ప్రసిద్ధ పట్టణాలు కూడా చూడవచ్చు.
నవాన్శాహర్ ఎలా చేరాలి ?
నవాన్సహార్ కు రైలు రోడ్డు మార్గాలు అనుకూలం. వివిధప్రదేశాల నుండి తేలికగా ఇక్కడకు చేరవచ్చు. నవన్సహర్ కు సమీప ఎయిర్పోర్ట్ లూధియానా లో కలదు. దీనిని "సహ్నేవాల్ "ఎయిర్ పోర్ట్ అంటారు ఒక గంటలోపు ప్రయాణంలో ఎయిర్పోర్ట్ కు చేరవచ్చు.
నవన్శాహర్ పర్యటనకు ఉత్తమ సమయం
నవన్సహర్లో వేసవులు అధిక వేడి, శీతాకాలాలు చలి, వర్షాకాలం తేమ గాను వుంటుంది. ఈ నగర పర్యటనకు అక్టోబర్ నుడి మార్చ్ వరకూ అనుకూలం. ప్రధానంగా వింటర్ అనుకూలం.



Click it and Unblock the Notifications