మూడున్నర కిలోమీటర్ల పరిధి లో విస్తరించిన ఈ కేంద్రంలో అనేక దేశీ మరియు వలస పక్షులకి అవాసము. ఈ సంరక్షణా కేంద్రం నోఇడా లో ఢిల్లీ సరిహద్దు లో యమునా నది ఉత్తర ప్రదేశ్ వైపు పారే చోట ఉంది.యమునా నదికి ఆనకట్ట కట్టి నిర్మించిన సరస్సు ఈ సంరక్షణా కేంద్రంలో ఒక ముఖ్య ఆకర్షణ. గౌతం బుద్ధా నగర్ కి తూర్పున, ఓఖ్లా గ్రామాని కి పశ్చిమ దిశలో ఈ సరస్సు ఉంది.
పక్షి శాస్త్రవేత్తలు నిర్వహించే రికార్డుల ప్రకారం ఈ సరస్సు 319 రకాల వలస పక్షులని ఆకర్షిస్తుంది. వీటిలో 50% చలి ప్రాంతాలయిన టిబెట్, యూరప్,సైబీరియాలలో నవంబరులో శీతాకాలం ప్రారంభమవ్వగానే ఇక్కడకి వచ్చి ఈ వెచ్చటి ప్రాంతం లో గడుపుతాయి. మరలా మార్చ్ లో వేసవి మొదలు కాగానే తిరిగి వెళ్ళిపోతాయి. 1874 లో ఆగ్రా కెనాల్ నిర్మించినప్పటి నుండీ పక్షి ప్రేమికులకి ఈ సంరక్షణా కేంద్రం చాలా ఇష్టమైన ప్రదేశం.



Click it and Unblock the Notifications