1986 లో భారత దేశానికి చెందిన "బహాయ్" జాతి వారు నిర్మించిన ఈ లోటస్ టెంపుల్ పద్మం ఆకారం లో ఉండి దీని నిర్మాణ శైలి వల్ల 20 వ శతాబ్దపు తాజ్ మహల్ గా భావిస్తారు.ఢిల్లీ లో గల భవనాలలో ఇది అత్యంత సుందరం మరియు అధ్భుతంగా ఉండటం వల్ల దీనిని ఢిల్లీకి మకుటామయ చిహ్నంగా పిలుస్తారు. దీని సందర్శన కి అమెరికా,బ్రిటన్ ల నుండి నిర్మాణశైలి ని చూడటానికే వస్తుంటారు.
సగం విడిచిన పద్మం ఆకారంలో నిర్మించిన ఈ గుడి ఆధ్యాత్మికత, ప్రశాంతతకి ధామము. తెల్లటి మార్బుల్ పరచబడిన దేవాలయం చుట్టూ తీర్చిదిద్దిన లాన్స్,ఉద్యాన వనాలు,దారులు, అందం గా చెక్కబడీన స్థంబాలు ఉన్నాయి.ఇక్కడ మెట్లు, బ్రిడ్జీలు ఉన్నకొలనులు 9 ఉన్నాయి.
ఈ గుడీలో బేస్మెంట్ లో ప్రార్ధనలకి ఉపయోగించే పెద్ద హాలు ,రిసెప్షన్ సెంటర్,లిబ్రరీ,పరిపాలనా విభాగం ఉన్నాయి. ప్రతీ గంట కీ ప్రదర్శించే ద్రుశ్యశ్రవణ వీడియో వల్ల సందర్శకులకి ఈ గుడి గురించి తెలుసుకునే వీలు కలుగుతుంది. వర్షం మరియు ఇతర వాతావరణ పరిస్థితులని తట్టుకోవడానికి వీలుగా పద్మం ఆకారం లో ఉన్న పై కప్పుని గ్లాస్ మరియు ఉక్కుతో చేసిన పై కప్పుతో కప్పి ఉంచారు. పై కప్పులో గ్లాస్ వాడటం వల్ల సహజమైన వెలుతురు హాలు నిండా పరచుకుంటుంది.