1998 లో నిర్మించ ఈ ఇస్కాన్ మందిరం న్యూ ఢిల్లీ కైలాష్ ప్రాంతం నోయిడా శాంతి నగర్ లో ఉంది. ఈ అత్యద్భుత మందిరాన్ని ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ క్రిష్ణా కాన్షియస్నెస్ లేదా ఇస్కాన్ అనబడే సంస్థ ద్వారా నిర్మించబడినది. హరే రాం హరే క్రిష్ణ అనే కీర్తన లేదా శ్లొకం ఇస్కాన్ భక్తులు పాడటం వల్ల ఈ గుడి నే హరే రాం హరే క్రిష్ణ గుడి అని కూడా అంటారు.
భగవద్గీత సారాన్ని వ్యాప్తి చేయడానికి ఆచార్య భక్తి వేదాంత స్వామి ప్రభు పాద చొరవ తీసుకుని ఈ మందిరాన్ని నిర్మించారు. ఆశ్చర్యకరంగా రష్యన్ కళాకారులు ఈ గుడి ఆవరణని సితారాములు, రాధ క్రిష్ణుల కధలు తెలిపే చిత్రాలతో అలంకరించారు.ఈ కేంద్ర ముఖ్య ఆకర్షణ ప్రార్ధనలకి ఉపయోగించే పెద్ద హాలు.రాధా క్రిష్ణుల అధ్భుత విగ్రహాలున్న మ్యూజియం కూడా ఉంది.
రోజువారి ప్రార్ధనలు,శ్లోకాలు,హారతులు,కీర్తనలు, ప్రవచనాలే కాకుండా ఈ మందిరం లో మహాభారతం, రామాయణలాలలో ని ముఖ్య ఘట్టాలని వివరించే మల్టీమీడియా షో లు పొద్దున్న సాయంత్రం కూడా ఉంటాయి