చౌరఘర్ శిఖరం సముద్ర మట్టానికి 1326 మీటర్ల ఎత్తున కలదు. పంచామారి లో ఇది ఎత్తైన శిఖరం. ఇక్కడ నుండి చుట్టూ వున్నా అడవులు, జలపాతాలు, లోయలు అద్భుతంగా చూడవచ్చు. ఇక్కడే ఒక శివాలయం కూడా కలదు. ఈ శివాలయం కు మహాశివరాత్రి నాడు వేలాది భక్తులు వస్తారు. శివుడి పై భక్తి శ్రద్ధలతో భక్తులు చిన్న త్రిశూలం చేతపట్టి వస్తారు. ఈ టెంపుల్ చేరాలంటే 1250 మెట్లు ఎక్కాలి. పైకి చేరిన తర్వాత అక్కడ కల ధర్మశాల అనే విశ్రాంతి భవనంలో సేద తీరవచ్చు. భక్తులే కాక సాహస క్రీడలు చేసే వారు సైతం ఇక్కడకు ట్రెక్కింగ్ లో వచ్చి ఆనందిస్తారు.