పక్కే టైగర్ రిజర్వ్, అరుణాచల ప్రదేశ్ లోని ఎంతో ప్రియమైన పర్యాటక కేంద్రాలలో ఒకటి. తూర్పు కమెంగ్ జిల్లాలో ఈ ప్రదేశం 862 చ.కి.మీ. మేరా విస్తరించి ఉంది. ఖేల్లోంగ్ అటవీ విభాగంలో భాగమైన ఈ ప్రాంతాన్ని 1977 లో గేం అభయారణ్యంగా ప్రకటించారు. ఈ టైగర్ రిజర్వ్ ను 2002 లో అభయారణ్యంగా ప్రకటించారు.
వన్యప్రాణి వద్దకు . . .
అరుణాచల ప్రదేశ్ లోని అటవీ శాఖ వారు వన్యప్రాణిని సంరక్షించడానికి చేసిన ప్రయత్నాల ఫలితమే ఈ టైగర్ రిజర్వ్. అడవులలో సంరక్షించబడిన పులులతో బాటు, వేటాడే పిల్లి, నక్క, అడవి దున్న, ఎగిరే ఉడత, చిరుత, మబ్బుల చిరుతపులి, అడవి కుక్క, సాంబార్, ఏనుగు, హాగ్ లేడి, రీసస్ వానరం, మొరిగే జింక, అడవి పంది వంటి అనేక జంతువులు చక్కగా సంరక్షించబడుతున్నాయి.
పక్కే టైగర్ రిజర్వ్ పక్షిశాస్త్రవేత్తలకు, పక్షులను చూడటానికి ఇష్టపడే వారిని ఆకర్షించే విభిన్నరకాల హార్న్ బిల్ లకు కూడా ప్రసిద్ధి. ఈ రిజర్వ్ లో కనబడే ఇతర పక్షి జాతులలో అడవి పక్షులు, పావురము, ఖలీజ్ వేటకు ఉపయోగించే ఒక పక్షి, బాతులు, డేగ, డ్రోంగో, బార్బెల్ లు , వేటకు ఉపయోగించే నెమలి పక్షి, తెలుపు రెక్కలు వడ్రంగి బాతు ఉన్నాయి.
కొండచిలువ, కట్లపాము, నాగుపాము వంటి కొన్ని సరీసృపాల జాతులు కూడా ఈ రిజర్వ్ లో కనబడతాయి.
పక్కే టైగర్ రిజర్వ్ పర్యటనకు ఉత్తమ సమయం
ఇక్కడ గాలి కాలుష్య రహితంగా ఉండి, సువాసన తాజాగా ఉంటుంది. అయితే, ఈ అభయారణ్యం సందర్శనకు అక్టోబర్, మార్చి మధ్య కాలం ఉత్తమమైనది.
పక్కే టైగర్ రిజర్వ్ ను చేరడం ఎలా
ఈ అభయారణ్యానికి దగ్గరి విమానాశ్రయం తేజ్పూర్. పక్కే టైగర్ రిజర్వ్ కు అతి దగ్గరి రైలు స్టేషన్ రంగపర. అన్ని ప్రధాన నగరాల నుండి రోజువారీ బస్సులు అందుబాటులో ఉన్నందున భారతదేశంలోని ఏ ప్రాంతం నుండి అయిన ఈ అభయారణ్యాన్ని సందర్శించడం పర్యాటకులకు సులువుగా ఉంటుంది.
నమ్దఫా నేషనల్ పార్కు – ఈశాన్య ప్రాంతంలో వన్యప్రాణిని అన్వేషించండి
నమ్దఫా నేషనల్ పార్కు, అరుణాచల ప్రదేశ్ లోని ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఒకటి. తూర్పు హిమాలయాల మొత్తం మీద జీవవైవిధ్య అనుకూల ప్రదేశంగా కూడా ప్రకటించబడిన నమ్దఫా అతి పెద్ద సంరక్షిత ప్రాంతం. వైశాల్యపరంగా చూసిన, దేశంలోని అతి పెద్ద పార్కులలో ఇది ఒకటి. ఛంగ్లంగ్ జిల్లాలో ఉన్న నమ్దఫా, వన్యప్రాణి అభయారణ్యానికి ప్రసిద్ధి చెందింది. దీనిని జాతీయ పార్కు గా ప్రకటించారు.