రీస్ మేగోస్ చర్చి మరియు రీస్ మేగోస్ ఫోర్ట్ రెండూ కూడా చూడదగిన అందమైన తెల్లని భవనాలుగా ఆకర్షణీయంగా కనపడతాయి. ఇవి మండోవి నది ఒడ్డున కలవు. నదిపై నుండి చూస్తే అద్భుతంగా ఉంటాయి. బర్దేజ్ జిల్లాలో రీస్ మేగోస్ చర్చి మొట్టమొదటి చర్చి అని చాలామంది అంగీకరిస్తారు. అక్కడే కల కోట అగూడే కోట కంటే కూడా 50 సంవత్సరాలు ముందుదని చెపుతారు. రీస్ మేగోస్ చర్చి 1555 సంవత్సరంలో నిర్మించారు. ఇది సెయింట్ జెరోమ్ కు అంకితం చేయబడింది. ప్రతి సంవత్సరం జనవరి 6వ తేదీన ముగ్గురు తెలివైన మనుషులు లేదా ముగ్గురు తెలివైన రాజులనే పేరుతో ఫీస్ట్ వేడుకలను నిర్వహిస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే, ఈ చర్చి ముగ్గురు ఫ్రాన్సిస్కన్ సన్యాసులచే ఆధిపత్యం వహించబడి విదేశాలలో మత ప్రచారం చేయబడింది. కొంతమంది చారిత్రకులు ఈ చర్చి ఒక హిందూ పవిత్ర స్ధలంలో నిర్మించబడిందని కూడా చెపుతారు. దానికి ఆధారాలుగా కొన్ని చెక్కడాలు, శిల్పాలు హిందూ దేవాలయాలలో ఉండేవి ఇక్కడ కనపడతాయి. బయటి గోడలు తెల్లటి రంగులో అందంగాను లోపలి భాగాలు వివిధ రంగులు కల పెయింటింగులతోను వుంటాయి. ఈ పెయింటింగులలో ఈ ముగ్గురు మత సన్యాసులు కానుకలతో జీసస్ ను కలుస్సతున్నట్లు ఒక పెయింటింగ్ ఉంటుంది. ఫీస్ట్ తో పాటు జనవరి 6వ తేదీన చర్చికి వచ్చే వారంతా ఈ గ్రామంలో ఒక ఊరేగింపు జరిపి ఆనంద సందేశ వ్యాప్తి చేస్తారు. రీస్ మేగోస్ కోట పోర్చుగీస్ వారికి ఎంతో ప్రధానమైనదిగా ఉండేది. వారి ఇరువరు మాజీ వైస్ రాయ్ లను ఇక్కడే సమాధి చేశారు. వారి సమాధులు నేటికి చూడవచ్చు. రీస్ మేగోస్ చర్చి చేరడం చాలా తేలిక. అది ఈ ప్రాంతంలో బాగా పేరుపడ్డ ప్రదేశంలో ఉంది. మొదటి సారిగా వచ్చేవారు రీస్ మేగోస్ కు వస్తే చాలు అక్కడనుండి బాగా మరియు కాలన్ గూటే బీచ్ లకు చేరుకునే మార్గంలో ఈ చర్చి సందర్శించవచ్చు. అక్కడ కల సూచనా బోర్డులను గమనిస్తూ చేరుకోవచ్చు. పణాజిం, వాస్కో, మార్గోవాలనుండి రెగ్యులర్ గా టాక్సీలు, క్యాబ్ లు దలొరుకుతాయి. ఇది నార్త్ గోవాకు సమీపంలోనే కలదు.