ఈ కోటను 1551 లో నిర్మించారు. ప్రస్తుతం కొంత భాగం శిధిలమై ఉన్నప్పటికి పర్యాటకలు దాని ఆకర్షణకు ముగ్ధులవుతారు. పర్యాటకులు అధిక సంఖ్యలో రీస్ మేగోస్ కోటను దర్శిస్తారు. మండోవి నది ఒడ్డున కల ఈ కోట ఎంతో వైభవంగా ఉంటుంది. నదికి ఉత్తరంగా దీనిని సుల్తాన్ అదిల్ షా నిర్మించాడు. ఈ కోట చాలా సంవత్సరాలు పోర్చుగీసు పాలకులకు చుట్టు పక్కల రాష్ట్రాలనుండి భధ్రత కలిపిస్తూ ప్రాంతీయ భధ్రతకు ఒక చెక్ పోస్టుగా ఉపయోగపడింది. చారిత్రక ప్రాధాన్యత రీస్ మేగోస్ కోటను పోర్చుగీసు పాలకులు 1760వ సంవత్సరంలో కలిపారు. ఈ కోటకు వివిధ భధ్రతా గోపురాలు కలవు అవి శత్రువుల కదలికలను కనిపెట్టేందుకు వారికి అప్పట్లో ఉపయోగ పడ్డాయి. అయితే అవి నేడు చక్కటి మండోవి నది పనాజిం నగరం అక్కడి వివిధ నావలు, ఓడలు వంటివి పర్యాటకులకు చూపుతున్నాయి. ఈ కోట నిర్మాణంలో పూర్తిగా లేటరైట్ రాతిని ఉపయోగించారు. ఎరుపు మరియు సాధారణ రాయి రంగులు కలిగి ఉంటుంది.పోర్చుగీసు పాలనలో, రీస్ మేగోస్ కోటను గోవాపై మరాఠా రాజులు దండెత్తకుండా నిలువరించేందుకు వారి ఆచూకీ కనిపెట్టేందుకు ఉపయోగించేవారు. పోర్చుగీసు పాలన అంతం అయిన తర్వాత ఈ కోట కొంతకాలంఒక చెరసాలగా కూడా ఉపయోగించారు. ఆ తర్వాత దానిని ఒక పురాతన కట్టడంగా వదలివేశారు.