కట్రాజ్ సర్ప ఉద్యానవనం లో 160 రకాల పాములు, సరీసృపాలు ఉన్నాయి. 1986 లో పూణే-సతారా రహదారిలో కట్రాజ్ అనే చోట దీన్ని ఏర్పాటు చేశారు. ఎన్నో జాతుల పక్షులు, తాబేళ్ళు, సరీసృపాలు ఇక్కడ చూడవచ్చు.వన్యప్రాణి ప్రేమికులు ఇక్కడ దొరికే గోధుమ వర్ణపు పునుగు పిల్లిని చూడ్డానికి ఇష్టపడతారు. 9 అడుగుల నాగు పాము మరో ఆకర్షణ.నాగులని పూజించే నాగపంచమి ని ఇక్కడ చాల శ్రద్ధగా జరుపుతారు. ఈ సమయంలో పాములకు మనం చేస్తున్న హాని గురించి అవగాహన కల్పిస్తుంది. దగ్గరలోనే ఒక జంతు ప్రదర్శన శాల, ఉద్యానవనం కూడా వున్నాయి.నామమాత్రపు రుసుము తో ఈ పార్కు, బుధవారాలు తప్ప, అన్ని రోజుల్లోనూ సందర్శకుల కోసం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6 గంటల దాక తెరిచే వుంటుంది.