సరస్ బాగ్ పూణే లోని ప్రధాన పర్యాటక ఆకర్షణ. విఖ్యాత నానాసాహెబ్ పీష్వా నిర్మించిన ఈ బాగ్ పార్వతి కొండల సమీపంలోని పెద్ద, అందమైన తోట.ఈ పార్క్ లో ప్రసిద్ధ గణపతి దేవాలయం వుంది. 1774 లో 200 ఏళ్ళ క్రితం మాధవ రావ్ పీష్వా దీన్ని కట్టించాడు.మనం నిత్యం పడే ఒత్తిడి నుంచి విరామం తీసుకోవాలంటే స్వర్గేట్ కి కిలోమీటర్ దూరంలోని ఈ ప్రదేశం లో ఓ చక్కని సాయంత్రం గడప వచ్చు. ఇప్పుడు ఇక్కడ జాగింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేశారు.