భారత స్వాతంత్రోద్యమ చరిత్ర లో దాని ప్రాముఖ్యం వల్ల ఆగా ఖాన్ పేలస్ ప్రసిద్ది పొందింది. దీన్ని సుల్తాన్ మొహమ్మద్ షా, ఆగా ఖాన్ III నిర్మించాడు. ఇది పూణే జిల్లాలో వుంది.బ్రిటీష్ రాజ్యంలో మన స్వాతంత్రోద్యమ వీరులను, విప్లవకారులను బ్రిటీష్ వారు ఇక్కడ ఖైదీలుగా వుంచారు.
1942 లో క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత మహాత్మా గాంధీని, ఆయన భార్య కస్తుర్బా ని ఖైదు చేసింది కూడా ఇక్కడే.స్వాతంత్రోద్యమ వీరుల స్మారకాలు ఈ కోట నిండా చాలా వున్నాయి, అవి చూడగానే మనకు చాల గర్వంగా అనిపిస్తుంది. ఇవి ఇక్కడ పారే మూలా నది దగ్గర చూడవచ్చు.