పూణే లోని పీష్వా వంశస్తుల రాజ్య కేంద్రంగా వుండడం వల్ల శనివార్ వాడ చాల చారిత్రక స్థలం. సుమారు 300 ఏళ్ళ క్రితం 1730 లో బాజీ రావ్ దీన్ని నిర్మించారు.1827 లో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల ఈ కోట బుగ్గిపాలవడంతో ఇప్పుడు శిధిలాల్లో వుంది. ఈ కోటను చూసేటప్పుడు సౌండ్ అండ్ లైట్ షో చూడాల్సిందే.అప్పటి మరాఠా నిర్మాణ శైలి, అప్పుడప్పుడే వస్తున్న ముఘలాయి నిర్మాణ శైలుల మేలుకలయిక అయిన ఈ కోట మరాఠా సంస్కృతికి సాక్షిగా నిలుస్తుంది.



Click it and Unblock the Notifications