పుష్కర్ లోని మూడు పవిత్ర దేవాలయాలలో ఒకటైన ఆప్తేశ్వర్ దేవాలయం ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. 10వ శతాబ్దంలో నిర్మించిన ఈ దేవాలయం శివునికి చెందినది. ఈ దేవాలయ ప్రధాన సభామందిరంలో ఒక పెద్ద శివలింగం ఉంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ధ్వంసం చేసిన దేవాలయాలలో ఇది ఒకటి. తర్వాతి కాలంలో దీనిని తిరిగి నిర్మించారు.