పర్వతారోహణ వంటి సాహసాలు చేయాలనుకునే పర్యాటకులకు రామానగరం సూచించదగినది. ఈ ప్రదేశం ఒక వ్యాలీలో ఉంటుంది. బెంగుళూరుకు సుమారుగా 48 కి.మీ.ల దూరంలో కొండలతో నిండి ఉంటుంది. ఈ కొండలు అతి ప్రాచీనమైనవి. దక్షిణ భారత దేశంలో 1960 నుండి ఇక్కడ పర్వతారోహణ జరుగుతోంది. ఈ కొండలలో రామదేవర బెట్ట, ఎస్ ఆర్ ఎస్ బెట్ట మరియు తెంగినకలబెట్ట కొండలు ప్రధానమైనవి. ఇక్కడ వివిధ పొడవైన గ్రానైట్ కొండలు 1 నుండి రెండు పిచ్ ల పొడవు కలిగి తేలికగా అధిరోహించగలిగినవిగా ఉంటాయి. వనక్కల్ వాల్, గబ్బర్ కి అసలీ పసంద్, రెయిన్ బౌ వాల్ మరియు అన్నా - తమ్మా అనే కొండలు కూడా ప్రసిద్ధి. పర్వతారోహణకు సరి లేని ప్రదేశాలు గుర్తించి వాటిని అధిరోహించటం ప్రమాదం అని తెలుపుతారు.