బారా పానీ గా పిలువబడే ఉమియం సరస్సు మేఘాలయ లోని రీ భోయి జిల్లాలో ప్రసిద్ధ పర్యాటక గమ్యస్థాన. ఈ సరస్సును 1960 లలో ఉమియం నది మీద జల విద్యుత్ ఆనకట్ట నిర్మించడం ద్వారా ఏర్పాటు చేసారు. ఈనాడు ఈ సరస్సు జల క్రీడలు, సాహస క్రీడల సౌకర్యాలతో ఒక అద్భుతమైన పర్యాటక ఆకర్షణగా వెలుగొందుతోంది. ఈ ప్రాంతం లోని మేఘాలయ పర్యాటక విభాగం, రాష్ట్ర అధికారులు కలిసి అందమైన కొండల మధ్య కయాకింగ్, వాటర్ సైక్లింగ్, షూటింగ్, బోటింగ్ లాంటి సౌకర్యాలు కల్పించారు.
ఈ సరస్సుకి దగ్గరలో ఉండే ఆర్చిడ్ టూరిస్ట్ లాడ్జ్ ఇక్కడ బస చేయడానికి అనుకూలమైన ప్రదేశం. ఇది స్థానికులకు ఒక అద్భుతమైన ప్రసిద్ధ విహార కేంద్రం కూడా దీనికి ప్రధాన కారణం ఈ సరస్సు చుట్టూ ఏ ప్రదేశం నుండి చూసినా మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఉమియం సరస్సు షిల్లాంగ్ నుండి షుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది, షిల్లాంగ్ నుండి పర్యాటక వాహనం లేదా స్థానిక అద్దె టాక్సీలలో ఈ ప్రాంతానికి చేరుకోవడం ఉత్తమం మార్గం.



Click it and Unblock the Notifications