షేఖావతి నుంచి 82 కిలోమీటర్ల దూరంలో చురు వుంది. రాజస్థానీ నిర్మాణ శైలిలో నిర్మించిన విలాసవంతమైన ప్రాసాదాలు (రాజ భవనాలు), కోట లకు రాజస్థాన్ లోని ఈ జిల్లా బాగా ప్రసిద్ది. ఈ కోటల బయటి గోడల మీద వున్న చిత్రాలు స్థానిక వీరుల కథలను వర్ణిస్తాయి.
కన్హైయా లాల్ హవేలీ, సురానా హవేలీ, మాల్జీ కా కమ్రా అనే మూడు ప్రాసాదాల గోడల మీద దోలా, మరు ల (స్థానిక కథ లోని పాత్రలు) జీవితం లోని వివిధ అ౦కాలను ప్రదర్శించే చిత్రాలు వున్నాయి.1739 లో ఠాకూర్ కుషాల్ సింగ్ నిర్మించిన ఒక కోట ఈ ప్రాంతపు ప్రసిద్ధ ఆకర్షణ. నగర్ శ్రీ మ్యూజియం, లక్ష్మీ నారాయణ్ ప్రాసాదం, చాంద్ గోతియా ప్రాసాదం, లక్ష్మీ నారాయణుల దేవాలయం ఇక్కడి ఇతర చూడదగ్గ ప్రదేశాలు.
ఆత్ కంభ చాత్రి, గొండియా చాత్రి లాంటి చారిత్రిక అందాలు కూడా పర్యాటకులకు కనువిందు చేస్తాయి. అందమైన కుడ్య చిత్రాలు, వర్ణ చిత్రాలు ఈ చాత్రీల అంతర్భాగాలను చూపరులకు కనుల పండువ గా మారుస్తాయి. రఘునాథ్ జీ దేవాలయం, చాంద్ గోతియా దేవాలయాలు, జామ మసీదు, నాథ్ జీ కా దొరా, సేఠానీ కా జోహారా, బాలాజీ దేవాలయం ఈ జిల్లాల్ని ఇతర ఆకర్షణలు.