ప్రస్తుతం రాజస్తాన్ లోని ఝుంఝును జిల్లాలో వున్న ముకుంద్ ఘర్ 18వ శతాబ్దం లో ముకుంద్ సింగ్ మహారాజు స్థాపించాడు. ఇక్కడి వివిధ ప్రాసాదాలు దివాన్ ఖానా లకు, కుడ్య చిత్రాలకు ప్రసిద్ది చెందాయి. ఈ దివాన్ ఖానాల్లో ప్రదర్శించే వివిధ వస్తువుల్లో 17, 18 శతాబ్దాల నాటి గోడల మీద వేలాడే చిత్రాలు, కుటుంబ చిత్రాలు, చెక్క కుర్చీలు, ప్రధానమైనవి.
రంగులద్దిన కుటుంబ చాత్రీలు చూసి తీరవలసిందే.వేణు గోపాల మందిరం, గోపీ నాథ దేవాలయం లాంటి కృష్ణుడి దేవాలయాలు ఇక్కడ వున్నాయి. ఫోర్ట్ విలియం హవేలీ, ఘువలె వాలోన్ కీ హవేలీ, గంగా బాక్స్ సరాఫ్ హవేలీ, రాజ్ కుమార్ గానేరీవాలా కళా కేంద్ర లాంటివి ఈ పట్టణం లోని ఇతర ప్రధాన పర్యాటక ఆకర్షణలు.