సమాధులు సాధారణంగా చతురస్త్రం లేదా దీర్ఘచతురస్త్రాకార౦ లో ఉంటాయి, ఇవి సాధువులు, సన్యాసుల గుర్తుకోసం అంకితం చేయబడ్డాయి. రాళ్ళతో లేదా ఇటుకలతో నిర్మించిన ఈ సమాధులు బూడిద లేదా చనిపోయిన ఆత్మల అవశేషాలను కలిగిఉంటాయి. ఇవి ఛాయాచిత్రాలను లేదా విగ్రహాలను, వారి జీవితం, పని గురి౦చి క్షుణ్ణంగా వివరించే శాసనాలను కూడా కలిగిఉంటాయి. ఇలాంటి ఒక సమాధి సార్స నగర పశ్చిమ భాగంలోని రానియా రహదారిపై బాబా బిహారి సాధువు గుర్తుగా అంకితం చేయబడింది. ఈ సమాధి నిర్మించిన ప్రదేశంలో ఒక అందమైన తోట లేదా వాటిక, ఒక ఆలయం కూడా ఉన్నాయి.
ఈ సమాధి ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీన భండారా లేదా ఉచిత ఆహార పండుగను నిర్వహిస్తుంది. ఈ పండుగ సంగీత కచేరీలు, నృత్యాలు, క్రీడలు, థియేటర్ ప్రదర్శనలు, కవితా పారాయణాలు, షాపింగ్ తోపాటు రుచికరమైన స్థానిక, ప్రాంతీయ ఆహారానికి చెందిన వివిధ కోర్సులను, ప్రార్ధన సమావేశాలతో సహా వివిధ సాంస్కృతిక, వినోద కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఈ పండుగ అన్ని వయసుల వారికీ ప్రతిదీ అందిస్తుంది, అందువల్ల సందర్శకులు భారీ సంఖ్యలో హాజరవుతారు.



Click it and Unblock the Notifications