తమిళ్ నాడు లో ని తిరువన్నమలై జిల్లాలోని ఈ మఠం భారత దేశం లో ని జైన్ మతస్తులకు ఎంతో ముఖ్యమైనది. 1998 లో మొదలు పెట్టిన ఈ మఠం ముఖ్య ఉద్దేశం దీనజనోద్దరణ మరియు సమాజ సేవ.
ఈ మఠం లోపల నలుగు జైన మందిరాలు మూడు జైన గుహలు మరియు 16 మీటర్ల ఎత్తు ఉన్న నేమినాథ విగ్రహం ఉన్నాయి. 12 వ శతాబ్దానికి చెందినదిగా భావించే ఈ విగ్రహం తమిళ్ నాడు లో నే అతి పొడవైనది గా నమ్ముతారు. దక్షిణ భారత దేశపు ప్రముఖ చలన చిత్రాన్ని నేమినాథ నేపధ్యం లో నిర్మించారు.
భట్టరక ధవళకీర్తి ఈ మఠాధిపతి. అయన పేద ప్రజల కోసం అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. పేద విద్యార్ధుల కోసం ఉచిత విద్య మరియు వ్రుత్తి విద్యనందించడానికి అనేక పాఠశాలలను తెరిచారు.