కోదండ రామ ఆలయం మయిలడుతురై, తిరువరూర్ మధ్యలో ఉన్న ముదికొండన్ లో ఉంది. ఈ ఆలయం, ఈ గ్రామం షుమారు 20 శతాబ్దాల క్రిందటివని చుట్టుపక్కల వారి నమ్మకం. ఇది దక్షిణ భారతదేశం లోని పురాతన ఆలయాలలో ఒకటి. ఈ ఆలయంలో విష్ణుమూర్తి అవతారమైన రాముని విగ్రహం ఉంది. రాముడు ఈ ఆలయంలో రాజు దుస్తులలో కనిపిస్తాడు. రాజు అసలు పాలనకు ముందు రాముడు రాజుగా చిత్రించబడ్డాడని పురాణాల కధనం. ఇది భరద్వాజ మహర్షిని శాంతింప చేయడానికి జరిగింది. రాముని విగ్రహం కిరీటంతో అలంకరించబడి ఉంటుంది. ఈ ఆలయం రాముని భక్తులకు ప్రసిద్ది చెందింది, సంవత్సరం పొడవునా అనేకమందిని ఆకర్షిస్తుంది. ఈ ఆలయంలోని రాముడిని ప్రార్ధిస్తే భక్తుల పాపలు తొలగిపోతాయని ప్రజల నమ్మకం.