భారతదేశంలో మే లో సందర్శించవలసిన చల్లని ప్రాంతాలు..
భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దాంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవిలో సూర్యుని తాపం అధికంగా ఉంది. దాంతో చాలామంది శీతల వాతావరణానికి అంటే చల్లని ప్రాంతాలకు వెళ్లాలనుకుంటారు. భారతదేశంలో కూడా చల్లని ప్రదేశాలు చాలానే ఉన్నాయి. మే నెలలో మరింతగా వేడిగా ఉంటుంది కాబట్టి, ఎలాగో పిల్లలకు సెలవులు కాబట్టి కుటుంబంతో కలిసి అందరూ మే నెలలో భారతదేశంలోని ఈ ప్రదేశాలను సందర్శించండి. ఈ ఎండలో చల్లగా చల్లని వాతావరణాన్ని ఆస్వాదించాలంటే ఈ ప్రాంతాలను చుట్టేయాల్సిందే.

లేహ్, లడఖ్
లేహ్ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ వేసవి గమ్యస్థానాలలో ఒకటి. మేలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని సందర్శించడం మాత్రం మరవొద్దు. లడఖ్ భారతదేశంలోని కాశ్మీర్ ప్రాంతంలోని కేంద్రపాలిత ప్రాంతం. గతంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్న లడఖ్ 31అక్టోబర్ 2019న కేంద్రపాలిత ప్రాంతంగా చేశారు. నాటకీయ ప్రకృతి దృశ్యాలతో ఆధిపత్యం చెలాయించే లడఖ్ ప్రపంచంలోనే అత్యంత శీతల ఎడారిగా ప్రసిద్ధి చెందింది. లడఖ్ రాఫ్టింగ్ మరియు ఎత్తైన ట్రెక్కింగ్ కోసం ఒక అడ్వంచెర్ ప్లే గ్రౌండ్. ఈ ప్రాంతం సియాచిన్ హిమానీదం నుండి ప్రధాన గ్రేట్ హిమాలయాల వరకు విస్తరించి ఉంది.

గుల్మార్గ్, జమ్మూ & కాశ్మీర్
కాశ్మీర్ను భూమిపై స్వర్గం అని అంటారు. బరాముల్లా జిల్లాలో ఉన్నగుల్మార్గ్ ఈ స్వర్గాన్ని మరింత అందంగా చేస్తుంది. నిజానికి గుల్మార్గ్ ఒక అందమైన హిల్స్టేషన్. ఈ ప్రదేశాన్ని పూలభూమి అని కూడా పిలుస్తారు. ఇది బాలీవుడ్కు ప్రత్యేకమైన ప్రదేశం. ఈ ప్రదేశంలో చాలా సినిమాలు చిత్రీకరించబడ్డాయి. ప్రతి ఏటా ఇక్కడికి లక్షాలాది మంది పర్యాటకులు తరలివస్తుంటారు. మంచుతో కప్పబడిన శిఖరాలు, పొడవైన ఫైన్ చెట్లు, అందమైన పచ్చికభూములు తరచుగా ప్రజలను ఆకర్షిస్తాయి. కాశ్మీర్ నుండి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుల్మార్గ్, దేశంలోని ప్రధాన స్త్కై రిసార్ట్తో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద గోల్ఫ్ కోర్సును కలిగి ఉంది. జమ్మూ కాశ్మీర్లోని అందమైన హిల్స్టేషన్, గుల్మార్గ్ను ముందుగా గౌరీమార్గ్ అని పిలిచేవారు. శ్రీనగర్ విమానాశ్రయం నుండి గుల్మార్గ్ దాదాపు రెండు గంటల ప్రయాణం.
ఔలి, ఉత్తరాఖండ్
ఔలి ఒక ప్రసిద్ధి హిల్స్టేషన్ మరియు భారతదేశంలోని స్కీ రిసార్ట్గా ప్రసిద్ధిచెందిది. ఇది మంచుతో కూడిన వాలులకు ప్రఖ్యాతి గాంచింది. చల్లని గాలులు, మంచుతో కప్పబడిన విస్తారమైన ప్రకృతి దృశ్యం, సిల్వాన్ పర్వతాలు, అన్నీ కలిపి ఔలీని ఒక స్వర్గంగా మార్చాయి. ఔలి రాష్ర్టానికి ఉత్తరాన ఉంది. ఇది బ్రదీనాథ్ మార్గంలో జోషిమఠ్ నుండి 16కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 9000 అడుగుల ఎత్తులో ఉన్న దట్టమైన దేవదారు మరియు ఓక్ అడవులతో కప్పబడి ఉంటాయి.
ఈ ప్రాంత సముద్ర మట్టానికి 3,010కిమీ ఎత్తులో ఉన్న కేబుల్ కార్లో జోషిమత్ పట్టణాన్ని చూడొచ్చు. బ్లూ షీప్లను వీక్షించాలనునకుంటే మాత్రం తప్పకుండా నందా దేవి నేషనల్ పార్క్ను మాత్రం సందర్శించాల్సిందే.

తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్
హిమాలయాలలో నెలకొని ఉన్న తవాంగ్ అరుణాచల్ ప్రదేశ్లోని ఒక అందమైన చిన్న హిల్స్టేషన్. ఈశాన్య భారతదేశంలో అత్యధికంగా సందర్శించే పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ ప్రాంతానికి గొప్పసంస్కృతి చరిత్ర కలిగి ఉన్నాయి. తవాంగ్ భారతదేశంలోని అతిపెద్ద మఠాన్ని కలిగి ఉంది. బౌద్దులలో గౌరవనీయమైన గమ్యస్థానంగా ఉంది. తవాంగ్ పట్టణంలోని చుట్టుపక్కలా పైన్తోటలు రోడోడెండ్రాన్లతో హైకింగ్ ట్రయల్స్ అందుబాటులో ఉన్నాయి. తవాంగ్ మొనాస్టరీ (భారతదేశంలో అతిపెద్దది), 100 మీటర్ల ఎత్తు నుండి పడే అద్భుతమైన నురానాంగ్ జలపాతం మరియు 4,160 మీటర్ల ఎత్తులో ఉన్న సెలా సరస్సును సందర్శించండి.

షిల్లాంగ్, మేఘాలయ
మేఘాలయ అంటే మేఘాల నివాసం. జీవితంలోని ప్రతి ఆందోళన ఇక్కడికి రావడంతో ముగుస్తుంది. ఇక్కడ అనేక హిల్స్టేషన్లు ఉన్నాయి. వాటిల్లో షిల్లాంగ్ ఒకటి. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ భారతదేశంలోనే అత్యంత అందమైన హిల్స్టేషన్. దీనిని స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. షిల్లాంగ్లో ప్రపంచంలో ఎత్తయిన జలపాతం ఉంది. దీనిని వీక్షించేందుకు ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు సందర్శిస్తారు. ఈ ప్రాంతంలోని సరస్సులు, జలపాతాలు, తోటలు మరియు నడక మార్గంతో వీటిని చూడొచ్చు. తూర్పు ఖాసీ హిల్స్లోని మాఫ్లాంగ్ సేక్రేడ్ ఫారెస్ట్ను కూడా సందర్శించవచ్చు. ఈ ప్రాంతంలో ఎలిఫెంటా ఫాల్, షిల్లాంగ్ వ్యూ పాయింట్, లేడి హైదరీ పార్క్, వార్డ్స్ లేక్, గోల్ఫ్ ఫోర్స్ మ్యూజియం, కాథలిక్, కేథ్రడిల్ ఆర్చరీ మరియు ఆంగ్లికన్ స్మశానవాటిక చర్చివంటి అనేక సందర్శనా స్థలాలు ఉన్నాయి.

స్పితి వ్యాలీ, హిమాచల్ ప్రదేశ్
స్పితి వ్యాలీ భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ఒక చల్లని ఎడారి లాంటిది. ఈ ప్రాంతం మంచుతో కప్పబడి ఉంటుంది. స్పితి వ్యాలీ 12500 అడుగుల ఎత్తులో ఉంది.ఈ ప్రాంతం అన్నివైపులా హిమాలయాలతో కప్పబడి ఉంటుంది. ఇది భారతదేశంలోని అత్యంత శీతల ప్రదేశాలలో ఒకటి. ఎందుకంటే, ఈప్రాంతం సంవత్సరంలో కేవలం 250రోజులు మాత్రమే సూర్యరశ్మిని పొందుతుంది. ఇక్కడి సహజమైన సరస్సులు, నీలి ఆకాశం ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఈ లోయ చుట్టూ చిన్న చిన్న గుడిసెలు, బౌద్దవిహారాలు కూడా ఉన్నాయి. స్పితిని సందర్శించడానికి ఉత్తమ సమయం మార్చి నుంచి జూన్ మధ్య ఉంటుంది. అంతేకాకుండా, ఇక్కడ చంద్రతాల్ సరస్సు, సూరజ్ తాల్ లేదా ధంకర్ సరస్సులను వీక్షించొచ్చు.

కొడైకెనాల్, తమిళనాడు
తమిళనాడు రాష్ర్టంలో ఉన్నకోడైకెనాల్ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ హనీమూన్ గమ్యస్థానాలలో ఒకటి. తమిళనాడులోని లేక్సైడ్ అనేది ఒక రిసార్ట్ పట్టణం. కొడైకెనాల్లో అందమైన వాతావరణం, పొగమంచుతో కప్పబడిన అందమైన కొండలు మరియు జలపాతాలు ఇక్కడికి వచ్చే పర్యాటకులకు సాదర ఆహ్వనం పలుకుతాయి. కొడైకెనాల్ అంటే అడవుల బహుమతి అని అర్థం. కొడైకెనాల్ సముద్రమట్టానికి 7200 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ప్రాంతంలో బైకింగ్ లేదా ట్రెక్కింగ్ కూడా చేయవచ్చు. కొడైకెనాల్ సరస్సులో పడవ సవారీలను కూడా ఆస్వాదించొచ్చు. సుందరమైన పర్వత దృశ్యాల కోసం డాల్ఫిన్స్ నోస్ ను ఎక్కి అంతా వీక్షించొచ్చు. బ్రయంట్ పార్క్ వద్ద పైన్ ఫారెస్ట్ మరియు పిక్నిక్ గుండా షికారు చేయొచ్చు. ఈ ప్రాంతం పెంపుడు జంతువులకు కూడా అనుకూలమైనది.



Click it and Unblock the Notifications

















