దేశంలో మామిడి రుచులకు ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు
మామిడి పండ్లు. ఈ పేరు వింటేనే నోరూరిపోతుంది. మామిడిని ఇష్టపడని వారు ఎవరూ ఉంటారు చెప్పండి. ఇక్కడ వేసవి కాలంలో మామిడిని అనేక రకాలుగా వినియోగిస్తారు. మామిడి జ్యూస్ నుంచి పచ్చి మామిడి చట్నీ వరకూ అన్ని రకాల డిష్లలోనూ ఇది సందడి చేస్తుంది. భారతదేశంలో వేసవి కాలం అంటే రోజూ మామిడి పండ్లను రుచి చూడాలని అనుకుంటారు. మీరు మీ నగరంలో అనేక రకాల మామిడి పండ్లను చూసుంటారు. అయితే ప్రత్యేకంగా మామిడి పండ్లకు ప్రసిద్ధి చెందిన కొన్ని నగరాలు ఉన్నాయి. కాబట్టి భారతదేశంలో అత్యుత్తమ మామిడి పండ్లు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకుందాం.

అల్ఫోన్సో(మహారాష్ట్ర)
అల్ఫోన్సో లేదా హపస్ మామిడి చాలా ప్రసిద్ధి చెందింది. ఇది మహారాష్ట్రలోని రత్నగిరి, రాయ్ఘర్ మరియు కొంకణ్ ప్రాంతం నుండి వస్తుంది. ఈ మామిడి తీపి రుచికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మామిడి రకాలలో ఇది కూడా ఒకటి.

బనగానపల్లె, నూజువీడు(ఆంధ్రప్రదేశ్)
బనగానపల్లి మామిడికాయ గుజ్జుతో నిండి, పీచు లేకుండా ఉంది. ఇది ఎక్కువగా పండించే ఆంధ్రాలోని బనగానపల్లె పట్టణం పేరు మీదుగా దీనికి ఆ పేరు వచ్చింది. ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ మామిడి. దీంతోపాటు నూజువీడులో కూడా తియ్యని నూజువీడు రసాలు ప్రసిద్ధి చెందాయి.

దసరి(ఉత్తర ప్రదేశ్)
దీనిని మలిహబడి మామిడి అని కూడా అంటారు. దసరి మామిడి భారతదేశంలోని ఉత్తర ప్రాంతాల నుండి అత్యంత ప్రజాదరణ పొందిన మామిడి రకాల్లో ఒకటి. ఉత్తరప్రదేశ్లోని మలిహాబాద్ ఈ రకమైన మామిడిని అత్యధికంగా ఉత్పత్తి అవుతుంది.

కుంకుమపువ్వు(గుజరాత్)
గుజరాత్ కుంకుమపువ్వు మామిడికాయల తీపి రుచి, జ్యుసి గుజ్జు మరియు కుంకుమపువ్వు సువాసన కోసం ఇష్టపడుతారు. అమరస్ వేసవి కాలంలో తినే ఒక ప్రసిద్ధ భోజనం.

తోటాపరి(కర్ణాటక)
తోటాపరి పుల్లని-తీపి రుచిని కలిగి ఉంటుంది. కానీ ఇప్పటికీ దీనిని దక్షిణ భారతదేశంలో చాలా ఇష్టపడతారు. ఇది ఊరగాయ మరియు సలాడ్లలో కూడా ఉపయోగించబడుతుంది. ఈ మామిడి పచ్చ రంగులో ఉంటుంది, కానీ పైనుండి చూస్తే చిలుక ముక్కులా ఉంటుంది. కాబట్టి దీనిని చిలుక అని పిలుస్తారు. ఇది ప్రధానంగా దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడులో ఉత్పత్తి చేయబడుతుంది.

హిమసాగర్ మరియు కిషన్ భోగ్(పశ్చిమ బెంగాల్)
కిషన్ భోగ్ మామిడిపండ్లు గుండ్రని ఆకారంలో ఉంటాయి. రుచిలో తియ్యగా ఉంటాయి. కిషన్ భోగ్ మామిడి పండ్లను పశ్చిమ బెంగాల్లో విరివిగా విక్రయిస్తారు. ఇది పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో అత్యంత ప్రసిద్ధి చెందింది. మరోవైపు హిసాగర్ స్వీట్లు మరియు పానీయాలలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది.

చౌసా(హిమాచల్ ప్రదేశ్)
ఉత్తర భారతదేశంలో తియ్యటి మామిడి పండు ఏదైనా ఉందంటే అది చౌసా మాత్రమే. చౌసా తీపి గుజ్జు మరియు ప్రకాశవంతమైన పసుపు రంగుకు ప్రసిద్ధి చెందింది. ఇది ప్రధానంగా పాకిస్తాన్లో పెరుగుతుంది, అయితే హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ మరియు కొన్ని ఇతర ఉత్తర భారత రాష్ట్రాల్లో కూడా ఉత్పత్తి చేయబడుతుంది.



Click it and Unblock the Notifications














