ఈ ఆలయాల సందర్శనతో న్యూ ఇయర్కు వెల్కమ్ చెప్పండి
భారతీయ దేవాలయాల వైభవం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందనే చెప్పాలి. ఇక్కడ సంప్రదాయాలకే కాదు మతపరమైన భావాలకు పూర్తి స్వేచ్ఛ ఉంది. అందుకే, తమ విశ్వాసాలను చాటిచెప్పే ప్రపంచ ప్రసిద్ధ దేవాలయాలకు కేంద్రంగా నిలిచింది మన దేశం. ఇక్కడి ఆచార వ్యవహారాలను, చరిత్రను తెలుసుకునేందుకు ప్రపంచం నలుమూలల నుండి సందర్శకులు ఎంతో విశ్వాసంతో ఇక్కడ ఉన్న వివిధ దేవాలయాలను దర్శించుకోవడానికి వస్తుంటారు. అద్భుతమైన శిల్పకళకు ప్రసిద్ధి చెందిన అనేక దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి.
ప్రపంచం మొత్తం వాటి అందం మరియు గొప్పతనం గురించి మాట్లాడుకుంటోంది. ఈ ఏడాది మరికొద్ది రోజుల్లో ముగిసిపోతోంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. మీరు కూడా పురాతన దేవాలయ సందర్శనతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలనుకుంటే, దేశంలోని ఈ ప్రధాన ఆలయాలను సందర్శించవచ్చు.

మహాకాల్ దేవాలయం, మధ్యప్రదేశ్
భారతదేశం యొక్క గుండె అని పిలువబడే మధ్యప్రదేశ్లోని అనేక మతపరమైన ప్రదేశాలు ప్రసిద్ధి చెందాయి. 12 జ్యోతిర్లింగాలలో రెండు ప్రధాన జ్యోతిర్లింగాలు ఇక్కడ ఉన్నాయి. అవి ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ మరియు ఖాండ్వాలోని ఓంకారేశ్వర్. మీరు మహాశివుని భక్తులయితే మాత్రం జీవితంలో ఒక్కసారైనా ఇక్కడ అడుగుపెట్టాలనుకోవడం అతిసయోక్తికాదు. ఆ ఆలయ దర్శనంతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాలనుకుంటే, మహాకాల్ ఆలయాన్ని సందర్శించవచ్చు. ఇది కాకుండా, ఉజ్జయినిలో అనేక ఇతర ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి.

మీనాక్షి అమ్మన్ ఆలయం, తమిళనాడు
దాదాపు 2500 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయం పార్వతీ దేవి అవతారమైన మీనాక్షి మరియు ఆమె భర్త సుందరేశ్వర్, శివునికి అంకితం చేయబడింది. మదురైలోని వైగై నది దక్షిణ ఒడ్డున ఉన్న ఈ ఆలయాన్ని మొదట 6వ శతాబ్దంలో నిర్మించారు. ఇది 16వ శతాబ్దంలో ధ్వంసం చేయబడింది. అనంతరం పునర్నిర్మించబడింది. ఈ ఆలయ నిర్మాణ శైలి అబ్బురపచేలా ఉంటుంది.

షిర్డీ సాయిబాబా ఆలయం, మహారాష్ట్ర
మహారాష్ట్రలోని షిర్డీలో ఉన్న సాయిబాబా ఆలయం ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది దీనిని సందర్శిస్తుంటారు. భారతదేశంలోని ఆలయ సంపద పరంగా షిర్డీ సాయిబాబా ఆలయం నాల్గవ అత్యంత ధనిక దేవాలయంగా చెప్పొచ్చు. ఏటా నూతన సంవత్సరం సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి కుటుంబసమేతంగా ఇక్కడికి వచ్చేవారి సంఖ్య అధికంగా ఉంటుంది.

సూర్య దేవాలయం కోణార్క్, ఒడిశా
ఒడిశాలోని పూరీ జిల్లాలో ఉన్న సూర్య దేవాలయం కోణార్క్ అనే చిన్న పట్టణంలో ఉంది. అద్భుతమైన వాస్తుశిల్పాన్ని ప్రదర్శిస్తూ, ఈ ఆలయం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. ఏడు గుర్రాలు లాగిన సూర్యభగవానుని రథం ఆకారంలో నిర్మించడం ఈ ఆలయం ప్రత్యేకత.

వైష్ణో దేవి ఆలయం, జమ్మూ మరియు కాశ్మీర్
జమ్మూలోని వైష్ణో దేవి ఆలయం హిందూ యాత్రికులకు అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి. త్రికూట పర్వతం మీద ఉన్న ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం కోట్లాది మంది ప్రజలు మొక్కులు చెల్లించుకుంటారు. దేశ విదేశాలలో ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయం భారతదేశంలోనే మూడవ అత్యంత సంపన్న దేవాలయం.

సిద్ధివినాయక దేవాలయం, మహారాష్ట్ర
హిందూమతంలో ఏ శుభ కార్యం జరిగినా ముందుగా శ్రీ గణేశ పూజతో ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా అనేక వినాయక ఆలయాలు ఉన్నాయి. వీటిలో ఒకటి, ముంబైలోని ప్రభాదేవిలో ఉన్న సిద్ధివినాయక దేవాలయం. ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటిగా కూడా గుర్తింపు పొందింది. సిద్ధివినాయక దేవాలయం మహారాష్ట్రలోని ప్రఖ్యాత ఎనిమిది గణేశ దేవాలయాలలో మొదటిదిగా చెప్పొచ్చు.



Click it and Unblock the Notifications















