త్రిపుర సుందరి ఆలయానికి పక్కనే కళ్యాణ్ సాగర్ సరస్సు ఉంది. ఈ సరస్సు అయిదు ఎకరాల మేరకు విస్తరించబడి ఉన్నది. దీని పొడవు 224 యర్డ్స్ కాగా వెడల్పు 160 యార్ద్స్. ఈ సరస్సు ని 124 ఏళ్ళ క్రితం త్రిపురా సుందరి ఆలయం నిర్మితమయిన తరువాత తవ్వారు. 1501 కి చెందిన మహారాజా కలియన్ మాణిక్య రాజుల కాలానికి చెందినది ఈ సరస్సు.
వివిధ రకాల చేపలు అలాగే నీటి జంతువుల జాతులు ఈ సరస్సులో ఉంటాయి. కొన్ని రకాల చేపలతో పాటు కొన్ని రకాల అరుదైన తాబేళ్ళకి ఈ సరస్సు స్థావరం. ఈ సరస్సులో ఫిషింగ్ ని నిషేదించారు. ఇక్కడి దేవాలయాన్ని సందర్శించే భక్తులు ఈ సరస్సులోని చేపల కోసం బిస్కట్స్ తో పాటు అటుకులను అందిస్తారు.
ఈ సరస్సు ఈ ఆలయం యొక్క అందాన్ని రెట్టింపు చెయ్యడం తో పాటు భక్తులకు పవిత్రమైన ప్రాంతం గా పూజింపబడుతోంది. ఉదయపూర్ ని సరస్సు నగరం గా మార్చిన అనేకమైన సరస్సులలో కళ్యాణ్ సాగర్ సరస్సు కూడా ఒకటి.