ఉదయపూర్ లోని స్ఫటిక ప్రదర్శనశాలప్రజల సందర్శనార్ధం 1994 లో తెరిచినా ఫతే ప్రకాష్ భవనంలో భాగం ఈ స్ఫటిక ప్రదర్శనశాల. 129 ఏళ్ళ నాటి ఈ మ్యూజియం లో ఓస్లర్ స్ఫటికాలు ప్రదర్శిస్తున్నారు. మహారాణా సజ్జన్ సింగ్ 1877 లో ప్రత్యేకంగా వీటిని ఇంగ్లాండ్ లో ప్రసిద్ది చెందిన ఎఫ్ & సి ఓస్లర్ కంపెనీ నుంచి తెప్పించారు.
ఈ గాలరీ లో స్ఫటిక దుస్తులు, ఫౌంటైన్లు, పింగాణీ సామాను, అద్దాల టేబుల్ టాప్ లు, సోఫా సెట్లు, రాళ్ళు పొదిగిన తివాచీలు, పరుపులు, సిమ్హాసనల్లాంటి కుర్చీలు లాంటివి యాత్రికులు చూడవచ్చు. ఇవే కాక, అత్తరు, తేనె సీసాలు, కొవ్వొత్తుల స్టాండ్లు, గాజు కోస్టర్లు ప్రదర్శనలో వున్నాయి. దర్బార్ హాల్లో, అక్బర్ తో పోరాడిన మహారాణా ప్రతాప్ సింగ్ తో సహా, ఉదయపూర్ పూర్వపు రాజుల చిత్రాలు కూడా ఉంచారు.ఈ గాలరీ లో ఇప్పటికీ రాచ కుటుంబీకుల వివాహ వేడుకలు జరుగుతున్నాయి.
స్ఫటికాల ప్రదర్శనశాలకు దగ్గరలోనే దిల్ కుష్ మహల్ లేదా ఆనంద భవనంలో వున్న అందమైన చిత్రాలు, నెమళ్ళ అమరిక ప్రసిద్ది చెందాయి. చూడడానికి అందంగా వుండే మోతీ మహల్ లేదా ముత్యాల భవనం అద్దాల పని తో అలంకరించారు.ఈ గాలరీ దగ్గరలోనే వున్న చీనీ మహల్ లో అలంకరించిన నేల పలకలను ప్రదర్శించారు.
కృష్ణ విలాస్ లో యాత్రీకులు – రాజ కుటుంబాల పండుగలూ, ఉత్సవాలు చిత్రించే చిన్న చిత్రాలు చూడవచ్చు. ఈ భవనం లోని పూర్వపు రాజుల చిత్రాలు వున్నాయి. బర్రి మహల్ లేదా ఉద్యానవన భవనం ఈ గాలరీ కి దగ్గరగా వుంది. ఇది సందర్శకుల కోసం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1వరకు, మధ్యాహ్నం 3గంటల నుంచి, రాత్రి 8 గంటల వరకు తెరిచి వుంటుంది.