ఉదయపూర్ లోని గులాబ్ బాగ్ సజ్జన్ నివాస్ ఉద్యానవనంగా పిలువబడే గులాబ్ బాగ్ ను 1850 లలో మహారాణా సజ్జన్ సింగ్ నిర్మించాడు. 0.40 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఉద్యానవనం ఉదయపూర్ లో అన్నిటికన్నా విశాలమైనది. ఈ భవన సముదాయంలోనే పురాతన వస్తువులు, అవశేషాలూ, రాచరికపు వస్తువులతో కూడిన విక్టోరియా హాల్ మ్యూజియం ఉంది.
ఈ ఉద్యానవనానికి దగ్గరలోనే ఒక జంతు ప్రదర్శన శాల కూడా ఉంది. మ్యూజియం, జూ కాకుండా ఈ భవన సముదాయంలో మహారాణా ఫతే సింగ్ నిర్మించిన సరస్వతీ భవన్ గ్రంధాలయం కూడా ఉంది. పురావస్తు శాస్త్రం, చరిత్ర, సిద్ధాంతాలకు సంబంధించిన అనేక రకాల పుస్తకాలూ ఈ గ్రంధాలయంలో దొరుకుతాయి, వీటితో పాటు మధ్య యుగానికి చెందిన చేతివ్రాత ప్రతులను కూడా యాత్రీకులు చూడవచ్చు.