ఉదయపూర్ లోని జగదీష్ దేవాలయం జగదీష్ ఆలయాన్ని గతంలో జగన్నాథ్ రాయ్ ఆలయంగా పిలిచేవారు, ఇది ఉదయపూర్ సిటీ పాలెస్ కి ప్రధాన భాగం. ఈ ఆలయంలో విష్ణుమూర్తి విగ్రహం ఉంది, దీనిని నగరం లోని అతిపెద్ద ఆలయంగా భావిస్తారు.
ఇండో-ఆర్యన్ శైలితో 1651 లో ఉదయపూర్ కి చెందిన మహారాణా జగత్ సింగ్ దీనిని నిర్మించారు. ఈ ఆలయంలోని విష్ణుమూర్తి విగ్రహం నల్ల రాయితో చెక్కబడి, నాలుగు చేతులను కలిగిఉంటుంది. ఇది అద్భుతంగా చెక్కిన స్తంభాలు, చిత్రించిన గోడలు, అలంకరించబడిన పైకప్పులు కలిగిన మూడు అంతస్తుల నిర్మాణం.
మొదటి, రెండవ అంతస్తులలో 50 స్తంభాల చొప్పున ఉన్నాయి. 79 అడుగుల ఎత్తు ఉన్న ఈ ఆలయ శిఖరంపై ఏనుగులు, గుర్రపు రౌతుతోపాటు సంగీతకారులు, నృత్యకారుల విగ్రహాలను కూడా చూడవచ్చు. గరుత్మంతుడు (సగం మనిషి, సగం డేగ) విష్ణుమూర్తి వాకిట్లో కాపలా కాస్తాడు. ఈ జగదీశ్ ఆలయానికి చేరువలో, సూర్య భగవానుడు, వినాయకుడు, శివుడు, శక్తి అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి.



Click it and Unblock the Notifications