రత్నగిరి ఉదయగిరి నుంచి 73 కిలోమీటర్ల దూరంలో వుంది. నగర హడావిడికి దూరంగా ఈ ప్రశాంత ప్రదేశాన్ని బౌద్ద సన్యాసులు బహుశా ధ్యానం కోసం ఎంచుకుని వుంటారు. బ్రాహ్మణి, విరూప నదీ లోయలో వున్న రత్నగిరిలో చుట్టూ స్థూపాలతో వుండే పెద్ద స్తూపం తో పాటు దూలాలు వున్న కొన్ని బౌద్ధ ఆరామాలు కూడా వున్నాయి.
వక్రరేఖ ఆకారంలో వుండే దేవాలయం అరుదైన తనదైన శైలిలో వుండేది. తవ్వకాల్లో బయట పడ్డ ఇతర ముఖ్యమైన వస్తువులతో పాటు ఇత్తడి, కంచు లోహాలతో తయారైన వివిధ బుద్ధ విగ్రహాలను రత్నగిరి మ్యూజియం లో ప్రదర్శనకు ఉంచారు. ఇక్కడ దొరికిన వివిధ హిందూ దేవతల విగ్రహాలను కూడా ప్రదర్శిస్తున్నారు. రత్నగిరి ఏడాది పొడవునా ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు తెరిచే వుంటుంది. చాలా మంది బౌద్ధ పర్యాటకులు, ఇతర మతాల వారు ఇక్కడికి వచ్చి బౌద్ధం లోని దైవత్వాన్ని రత్నగిరి వాతావరణంలో అనుభవిస్తారు.



Click it and Unblock the Notifications