ఒడిశా లోని లలితగిరి, రత్నగిరి, ఉదయగిరి, ధవళగిరి కొండల మీద బౌద్ధ సముదాయం వుంది. వీటిలో ఉదయగిరి నుంచి 14 కిలోమీటర్ల దూరంలో వున్న ధవళగిరి మీద వున్నది చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. సుప్రసిద్ధ కళింగ యుద్ధం జరిగి, అశోకుడు సార్వభౌమత్వం వెంట పరుగులు ఆపి బౌద్ధ౦ తీసుకున్న ప్రదేశం ధవళగిరి అని నమ్ముతారు.
ఇక్కడి తవ్వకాల్లో దొరికిన చాలా శాసనాలు, రాతి శాసనాలు, స్తూపాలు, బౌద్ధ శిల్పాలు – అశోకుడికి బౌద్ధం పట్ల వున్న ప్రేమను సూచిస్తాయి. ఇక్కడ చాలా చైత్యాలు, స్తంభాలు కూడా తవ్వి తీసారు. 1970 లో ‘శాంతి స్థూప’ పేరిట నిర్మించిన తెల్లటి నిర్మాణం ఇప్పుడు ప్రతి ఏటా బౌద్ద యాత్రికులు సందర్శించే ప్రసిద్ధ యాత్రా స్థలం. ఈ స్థూపం లోపల నిర్మించిన పలు బుద్ధ విగ్రహాలు ఈ ప్రాంతాన్ని దర్శనీయ స్థలంగా మార్చాయి. ఈ కొండ శిఖరం మీద వున్న శివాలయం లో శివరాత్రి పర్వదినాన్ని చాలా వైభవంగా చేస్తారు.