కోస్తాతీరంలో కల ఈ కోట షుమారు 6 మైళ్ళు విస్తరించింది. దీనిని పోర్చుగీసు వారు తమ ప్యత్యర్ధుల సముద్రపు దాడులను ఎదుర్కొనేటందుకు 1624 లో నిర్మించారు.మార్ముగోవా కోట నేడు గోవాలో పర్యాటకులచే అత్యధికంగా సందర్శించబడుతున్న వర్కా బీచ్ వంటి ఆకర్షణలలో ఒకటిగా ఉంది. అంతేకాక, అది పర్యాటక ప్రదేశాలైన మార్గోవా, మార్గోవా ఓడరేవు మరియు వాస్కోడా గామ లకు సమీపంలో కూడా ఉంది. మార్ముగోవా కోట భౌగోళికంగా ప్రసిద్ధి గాంచిన సల్సెటే కు వాయువ్యంగా ఉంది.చారిత్రక ప్రాధాన్యతమార్ముగోవా కోట ప్రధానంగా పోర్చుగీసు వారిచే మార్ముగోవా ను దాని చుట్టు పట్ల ప్రదేశాల సముద్రాన్ని రక్షించేందుకు నిర్మించబడింది. కోట ప్రవేశంలోనే దాని నిర్మాణం గురించి మరియు డాం ఫ్రాన్సిస్కో డా గామా మరియు రాజు డాం ఫిలిప్ ల పేర్లు లిఖించబడ్డాయి. ఈ శిలాశాసనం అప్పటి వైస్ రాయ్ జ్ఞాపికగా కోట ప్రారంభోత్సవంలో లిఖించబడింది. వైస్ రాయ్ 1703 లోని సామ్రాజ్యానికి రాజధానిగా మార్గోవాకు తన ప్రభుత్వాన్ని తరలించాడు కూడాను. చరిత్రను పరిశీలిస్తే, ఈ కోట ఎన్నో దాడులకు గురయింది. చివరకు పోర్చుగీసు వారు పురాతన గోవాలో స్ధిరపడేందుకు నిర్ణయించుకొని మార్గోవా కోటను మరాఠాలకు స్వాధీనం చేశారు. ఇప్పటికి ఈ కోటలో చక్కగా నిర్వహించబడుతున్న మూడు ఫిరంగులు, అయిదు జైలు గదులు, 20 బుల్వార్కులు, ఒక చర్చి కోట భధ్రతా సిబ్బందికి వసతి కలవు. కోట గోడ వ్యాసం సుమారుగా 10 కిలోమీటర్లు ఉండి అతి పెద్దదిగా కనపడుతుంది. కోటకు సమీపంలో కల వర్కా బీచ్ దాని సాంప్రదాయ కొయ్య బోట్ల తయారీకి సైట్ సీయింగ్ కు ప్రసిద్ధి గాంచింది. మార్ముగోవా కోట చూడాలంటే, వేసవి అత్యుత్తమ సమయం.
మార్ముగోవా కోట గోవాలోని డబోలిం విమానాశ్రయం చేరువలో సుమారు 4 కి.మీ. ల దూరంలో వాస్కోడా గామా నగరానికి దక్షిణ దిశగా ఉంటుంది. కోటకు క్యాబ్, బస్ లేదా రిక్షాలలో చేరవచ్చు. లేదా అద్దెకారు లేదా బైక్ తీసుకొని స్వంత డ్రైవింగ్ లో కూడా చేరవచ్చు.