సిక్కిం లోని తశిదింగ్ ఆశ్రమాన్ని మరో అద్భుతమైన పవిత్ర ప్రదేశంగా భావిస్తారు. కారణం: పద్మసంభవ గురువు 8 వ శతాబ్దంలో తశిదింగ్ ఉన్న భూమి నుండి సిక్కి౦ ని ఆశీర్వదించారు. గుండె ఆకారంలో చాలా అందమైన ప్రదేశంలో ఉన్న ఆకట్టుకునే కంచన్జుంగా పర్వతాన్ని ఈ నేపధ్యంలో చూడవచ్చు. తశిదింగ్ ఆశ్రమం 18 వ శతాబ్దంలో న్గాడాక్ సేమ్ప చేమ్పో చే నిర్మించబడింది – సిక్కిం మొదటి చోగ్యాల్ సమర్పణ వేడుకలు జరిగిన మూడు లామాలలో ఒకటి. ఇది ప్రసిద్ది చెందిన గోపురాలతో పాటు తశిదింగ్ కి కూడా ప్రసిద్ది చెందింది. దీనిని తోంగ్-వారంగ్-డోల్ అని పిలుస్తారు అంటే అర్ధం ‘దృష్టి ద్వారా రక్షించబడడం’, తదనుగుణంగా భక్తులు ఈ గోపురాలు చూసిన మాత్రానే వారి పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం.
తశిదింగ్ ఆశ్రమం ప్రసిద్ది చెందడానికి మరో ప్రధాన సంఘటన ఉంది. గోమ్పా లు ప్రతి ఏటా ‘పవిత్రమైన నీటి పండుగ’ ను జరుపుకుంటారు. ప్రతి ఏటా ఈ ఆశ్రమంలో లునర్ నెల 14, 15 తేదీలలో, భుమ్చు అనే వేడుకను జరుపుకుంటారు, అప్పుడు భక్తులు ఆ పవిత్రమైన నీటితో అశీర్వదించ బడతారు. ఈ పవిత్ర జలాన్ని ప్రతిసంవత్సరం ఒక పవిత్రమైన రోజున బైటికి తీసుకువెళతారు, మళ్ళీ లామాలు వాటిని సురక్షితంగా వెనక్కు తిరిగి తీసుకువస్తారు.