సిక్కిం లోని ఈ అందమైన సరస్సు బౌద్ధుల ద్వారా అలాగే హిందువుల ద్వారా బాగా గౌరవించబడింది, ఈ పవిత్రమైన నీటి భాగం కోరికలు నెరవేర్చే శక్తికలదని అంటారు. ఖ్చియో, పల్రి అనే రెండు పదాల కలయిక ఖేచియోపల్రి, దీని అర్ధం ‘ఎగిరే యోగినిలు/దేవతలు’, ‘రాజభవనం’ అని. ఖ-చోట్-పల్రి అని కూడా పిలువబడే ఈ అందమైన సరస్సు ఖేచోఎడ్పల్ద్రి కొండను చుత్తిఉన్న ఖేచియోపల్రి గ్రామానికి దగ్గరలో ఉంది, దీనిని పవిత్రమైనది గా కూడా భావిస్తారు. పురాణాల కారణంగా సరస్సులు పవిత్రమైనాయి...పద్మసంభవ గురువు ఈ సహజ సరస్సు వద్ద 64 యోగినిలను భోదించాడని నమ్ముతారు – తార దేవత పాదముద్రలు ఈ సరస్సు వద్ద ఉన్నాయని కూడా నమ్ముతారు – ఈమె వజ్రాయణ బౌద్ధ మతంలో ఆడ బౌద్ధురాలు. దీని ప్రకారం, ఈ సరస్సు వద్ద ఏరియల్ వీక్షణ నుండి పాదముద్రలు కనిపిస్తాయి. దీనిప్రకారం ఇక్కడ మరో ఆశక్తికర పురాణం ఉంది, ఈ ప్రత్యెక సరస్సు రొమ్ము భాగాన్ని సూచిస్తుందని నమ్ముతారు – మనవ శరీరంలోని నాలుగు నాడీ సముదాయంలో ఒకటి. మిగిలిన మూడూ తశిదింగ్, యుక్సోం, పెమయన్గ్త్సే ద్వారా ప్రాతినిధ్యం వహిస్తాయని నమ్ముతారు.
ఇంకా ఏమిటంటే, ఈ సరస్సు డేమజోంగ్ ముఖ్యమైన భాగాలలో ఒకటిగా కూడా ఉంది – ఈ లోయ ఖేచేయోపల్రి సరస్సు, తశిదింగ్ ఆశ్రమ౦, దుబ్డి ఆశ్రమం, యుక్సోం, పెమయన్గ్త్సే ఆశ్రమం, రాబ్దేన్త్సే శిధిలాలు, సంగ చోఎలింగ్ ఆశ్రమం పాలుపంచుకునే బౌద్ధ యాత్రీకుల సముదాయంలో ఒక భాగంగా ఉంది.
ఈ పవిత్ర నీటి శరీరంలో ఒక ఆశక్తికర నిజం కూడా ఉంది. కారణాలు తెలీదు, ఇక్కడి పక్షులు సరస్సులోని నీటిపై ఆకులు పడకుండా నిర్ధరించుకుంటాయి. సరస్సులో ఒక ఆకు పడితే వెంటనే, పక్షులు కిందకు ఎగిరి దాన్ని పట్టుకొని నీటిలో నుండి బైటికి విసురుతాయి!
ప్రతి ఏటా, ఏప్రిల్/మే మాసాలలో జరిగే మాఘ పౌర్ణమి అనే ధార్మిక పండుగ కేవలం భారతదేశం లోనే కాక, నేపాల్, భూటాన్ వంటి ఇతర ప్రాంతాలకు చెందిన వేలమంది భక్తులను ఆకర్షిస్తుంది. అంతేకాకుండా, ఇక్కడ ఏలకుల తోటల పంటల అభివృద్ధికి అక్టోబర్ లో ఈ సరస్సు వద్ద చ్చో-త్షో అనే మరో పండుగను నిర్వహిస్తారు.
ఈ ప్రాంతం ధార్మికంగా అదేవిధంగా పర్యాటకులలో ప్రాధాన్యత సంతరించుకున్నప్పటి నుండి, ఈ ప్రాంగణంలో కొన్ని అవసరమైన సౌకర్యాలు ఏర్పాటుచేయబడ్డాయి. ఈ సరస్సు గట్టు ప్రస్తుతం సరస్సు ముందు భాగం నుండి ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు. ఈ గట్టుతో పాటు ప్రార్ధన చక్రాలు, ప్రార్ధన జెండాలు అతికించబడి ఉన్నాయి, వీటివల్ల సరస్సు అందమే కాకుండా భక్తిపూరిత వాతావరణాన్ని కూడా కలిగిఉంటుంది.