త్రిపుర సరిహద్దులో వున్న రాష్త్రం కావడంతో అగర్తలా సరిహద్దు అంచుల వెంట వుంటుంది. అఖురా సరిహద్దు భారత్, బంగ్లాదేశ్ లను విభజిస్తుంది. ఈ రెండు రాష్ట్రాల మధ్య అన్ని కార్యకలాపాలకు ఇది ముఖద్వారం. ఇది పొరుగు దేశం నుంచి అత్యధిక పర్యాటక రద్దీని చవి చూస్తుంది.
భారత దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు, భారత్ – పాకిస్తాన్ విభజనకు ముందు అగర్తలాకు, తూర్పు బెంగాల్ కు మధ్య నిత్యం నడిచే రైళ్ళు ఉండేవి. ఈ ప్రాంతంలోని ప్రజలకు ఈ రైల్వే లైన్ జీవనాడి గా వుండేది. స్వాతంత్ర్యానికి పూర్వం ఇప్పటి బంగ్లాదేశ్ గుండా త్రిపుర చేరడం చాలా తేలికగా వుండేది, కానీ 1947 తరువాత అస్సాం గుండా ఒక పొడవైన జాతీయ రహదారిని ఇందుకోసం నిర్మించాల్సి వచ్చింది.
ఈనాడు అఖురా సరిహద్దు లో జరిగే అంతర్జాతీయ వాణిజ్యం వల్ల రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగు పడుతోంది. ఈ సరిహద్దు బంగ్లాదేశ్ లోపలికి, బయటకు న్యాయపరమైన ప్రవేశ ద్వారంగా కూడా ఉపయోగపడుతోంది. నిత్యం జరిగే సరిహద్దు పెరేడ్ ను చూడడానికి పర్యాటకులు అఖురా సరిహద్దును చూడవచ్చు.



Click it and Unblock the Notifications