జోగి గుండి జలపాతాలు చాలా పురాతనమైనవి సుమారు 1800 సంవత్సరంనుండి ఇవి ప్రవహిస్తూనే ఉన్నాయి. సుమారు 829 అడుగుల ఎత్తునుండి పడతాయి. ఇవి పడేటపుడు నాలుగు ప్రవాహాలు అంటే రాజా, రాణి, రాకెట్ మరియు రోరర్ అనే పేర్లతో ప్రవహిస్తాయి. వీటిని వర్షాకాలంలో తప్పక సందర్శించాలి. జోగిగుండి జలపాతాలు అగుంబేకు సుమారు 3 కి.మీ.ల దూరంలో ఉంటాయి. సుమారు మూడు వంతుల దూరాన్ని వాహనంపై ప్రయాణించి మిగిలిన దూరం ట్రెక్కింగ్ చేయాలి. స్ధానికుల మేరకు ఒక జోగి అంటే రుషి ఇక్కడికి సమీప గుహలోపల తపస్సు చేసేవాడని అతని పేరుతో జోగి గుండి జలపాతం పేరు పెట్టబడినదని చెపుతారు. ఈ జలపాతం మాలపహారి నది నుండి వచ్చి ఏర్పడిన ఒక చిన్న సరస్సునుండి వచ్చిందని చెపుతారు. కాలక్రమేణా ఈ జలపాతం 50 అడుగుల లోతుకు ప్రవహించి గుహగా ఏర్పడిందని చెపుతారు. ఇపుడు జలపాతం గుహ ద్వారానే ప్రవహిస్తోందంటారు.