కుంచికల్ జలపాతాలు దేశంలోనే అతి ఎత్తునుండి పారే జలపాతాలు. ఇవి షుమారు 1493 అడుగుల ఎత్తునుండి కిందకు పడతాయి. అగుంబిలో గల షిమోగాలో ఈ జలపాతాలు వారాహి నది కారణంగా ఏర్పడతాయి. ఇవి కర్నాటక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులకు ప్రధాన ఆధారంగా ఉంటాయి. వర్షాకాలంలో వారాహి నది ఉపనదులు వివిధ సీజనల్ జలపాతాలను కూడా అడవులలో అందిస్తాయి.
కుంచికల్ జలపాతాలకు చూట్టూ పారే ఈ జలపాతాలు చూసేందుకు కన్నుల పండువగా కనపడుతూంటాయి. ఈ ప్రాంతంలో కుంచికల్ జలపాతాలు పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. భారతదేశంలో అతి ఎత్తునుండి పారే జలపాతాలలో షుమారు 850 అడుగుల ఎత్తునుండి పారే బర్కానా జలపాతాలు కూడా ఒకటి. ఇవి అగుంబి నుండి షుమారు 7 కి.మీ.ల దూరంలో షిమోగా జిల్లాలోని సీతా నది నుండి పారి ఈ ప్రాంతంలో ప్రవహిస్తాయి. అగుంబే పర్యాటకులు ఈ ప్రదేశాన్ని తప్పక చూడాలి.