అజ్మీర్ లోని నసీయాన్ మందిరంలాల్ మందిర్ (ఎర్రని దేవాలయం) గా పిలువబడే ఈ నసీయాన్ మందిరం 1865 లో నిర్మించారు – ఇది అజ్మీర్ లోని పృధ్వీ రాజ్ మార్గ్ లో వున్నది. మొదటి జైన తీర్ధంకరుడు ఆదినాదుడి కోసం నిర్మించిన ఈ మందిరం రెండు అంతస్తుల్లో వుంది.
ఈ భవనం రెండు భాగాలుగా విభజించారు – ఒకటి ఆదినాదుడి విగ్రహం వున్న ప్రార్ధనా స్థలం కాగా రెండో దాంట్లో వున్న హాల్ లో మ్యూజియం వుంది.మ్యూజియం లోని భాగాలని బంగారం తొ నిర్మించారు – ఇవి పంచ కళ్యాణక్ అని పిలువబడే ఆదినాదుడి జీవితంలోని అయిదు దశలను సూచిస్తాయి.
3200 చదరపు అడుగుల విస్తీర్ణం లో వున్న ఈ భవనాన్ని బెల్జియం రంగుటద్దాలు, మినరల్ రంగులు – మచ్చల అద్దాల పని తొ అలంకరించారు.బంగారు, వెండి అలంకారాలతో వున్న మధ్య మంటపం కల ఈ భవనాన్ని స్వర్ణ మందిరం గా పిలుస్తారు. చెక్కతో నిర్మించిన ప్రతిరూపాలు, అద్దపు చెక్కుళ్ళు, చిత్రాలు కూడా ఈ దేవాలయం లో చూడవచ్చు.విలువైన రత్నాలు, బంగారు, వెండి వస్తువులతో అలంకరించిన ఈ మందిరాన్ని సోనే జీ కీ సయ్యాన్ అని పిలుస్తారు.