అజ్మీర్ లోని దర్గా షరీఫ్ రాజస్తాన్ లోని అత్యంత ప్రసిద్ధ యాత్రాస్థలం దర్గా షరీఫ్ ఖ్వాజా మొయిన్-ఉద్-దిన్ చిష్టి నివసించిన ప్రదేశం. ఆయన పేదలు, అణగారిన వర్గాల సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన సూఫీ సన్యాసి. ఈ స్థలం అన్ని మతాల ప్రజలచే గౌరవించబదుతుంది, ప్రతి సంవత్సరం లక్షలాదిమంది భక్తులు ఈ స్థలాన్ని సందర్శిస్తారు.
ఈ దర్గాను వెండి తలుపులతో వివిధ దశల్లో నిర్మించారు – ఇందులోనే పాలరాతి తో నిర్మించిన ఆ యోగి సమాధి వెండి రైలింగ్ తో వుంది. ఆ గొప్ప సూఫీ యోగి స్మారకార్ధం ప్రతి ఏటా ఆరు రోజుల పాటు ఇక్కడ ఉర్సు నిర్వహిస్తారు. ఆయన 114 సంవత్సరాల వయసులో ఒక గదిలో ఒంటరిగా 6 రోజులపాటు ప్రార్ధన చేసి తన శరీరాన్ని వదిలివేశారని అక్కడి ప్రజలు గాఢ౦గా నమ్ముతారు, అందువలన ఈ 6 రోజుల వ్యవధికి ప్రత్యేకమైన మతపరమైన ప్రాముఖ్య౦ ఉంది.
ఇతిహాసం ప్రకారం ఈ సూఫీ యోగి ఆశీర్వాదం వల్ల తనకు వారసుడు పుట్టిన సందర్భంగా అక్బర్ చక్రవర్తి గుండిగలు ఇచ్చినట్టు చెప్తారు. హుమాయూన్ చే నిర్మించబడిన ఈ సమాధి అజ్మీర్ లోని బంజరు కొండ దిగువ భాగాన ఉంది. ఇది తెల్లని పాలరాయితో నిర్మించబడి, పర్షియన్ శాసనాలతో పాటు 11 తోరణాలను కలిగిఉంది.