అజ్మీర్ లోని సోలా ఖంబా 16 స్తంభాల ఆదారం మీద పైకప్పు ఉండటంవల్ల దీనికి సోలా ఖంబా అనిపేరు వచ్చింది. ఇది ఔరంగజేబు పాలనలో నిర్మించబడింది. దీనిని షేక్ అలా-అల్-దిన్ సమాధి అని పిలుస్తారు, ఇది దర్గా షరీఫ్ వెలుపల ఉంది.
ఈ సమాధి ఖ్వాజ మొయిన్-ఉద్-దిన్ చిష్టి విగ్రహానికి పర్యవేక్షకుడు అయిన యోగి 4 సంవత్సరాల పటు నిర్మించారు. తెల్లటి పాలరాతితో నిర్మించిన ఈ భవనానికి నాలుగు మూలలా నాలుగు సన్నటి స్తంభాలతో కూడిన తోరణాలు ఉన్నాయి. మూడు తోరణాల సమాగమం చదునైన పైకప్పుకు దారి తీయడం ఈ నిర్మాణం లోని ప్రత్యేకత. తూర్పు వైపు వసారా, వెనుక వైపు పెరడు వుండే నమూనాలో నిర్మించిన ఈ మసీదు భారత దేశంలోకెల్లా పురాతనమైన వాటి లో ఒకటి. ప్రధాన భవనం లో 1399 చదరపు అడుగుల పైకప్పు వుండగా ముందు వైపు వసారా 1001 చదరపు అడుగుల విస్తీర్ణంలో వుంది.