కేరళలో అతి ప్రఖ్యాత మైన గుడులలో చెట్టికులంగర టెంపుల్ ఒకటి. అంతే కాదు, ఎక్కువ సందర్శించబడే గుడి కూడా. కేరళ లో శబరిమల తరువాత స్థానం ఈ గుడిదే. ఎన్నో కాలాల నుండి భక్తులు ఈ గుడికి తరలి వస్తున్నారు. ఈ 1200 ఏళ్ల క్రితం గుడికి ఒక ప్రత్యేకత ఆపాదించబడినది. ఇక్కడ కొలువుండే అమ్మవారు వివిధ రూపాలతో భక్తులకి దర్శనమిస్తారు.
ఉదయం మహా సరస్వతీ దేవిగా, మధ్యాహ్నం లక్ష్మీ దేవిగా మరియు సాయంత్రం శ్రీ దుర్గా దేవి గా అమ్మవారు దర్శనమిస్తారు. ఈ గుడికి సంబంధించి ఎన్నో జానపద, చారిత్రక, సాంప్రదాయక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అవన్నీఇక్కడకి సందర్శించడానికి ఏంతో ఉత్సుకతని కలిగించడమే కాకుండా, ఇక్కడ కొలువున్న దేవతల ప్రాముఖ్యం పెంచుతాయి.
కాంతివంతమైన రంగులు, డోలు నాదాలు, సాంప్రదాయక నృత్యాలతో ఇక్కడ జరుపుకునే పండుగలలో స్పష్టమైన ఆధ్యాత్మికానందం పొందవచ్చు. ఆ విధంగా, ఈ గుడి ఏంతో మంది భక్తులను అలాగే పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోంది.