నీలిరంగు పర్వత లోయలకి అలాగే దట్టమైన పచ్చటి అడవులు కలిగిన మెచుక, మెంబ తెగ గిరిజనులకు స్థావరం. అత్యద్భుతమైన అందం కలిగిన ఈ ప్రాంతం ప్రఖ్యాతి చెందిన పర్యాటక ఆకర్షణ. ఇక్కడ ఉన్నబౌద్ధ ఆశ్రమం 400 సంవత్సరముల క్రితానికి చెందినది అని అంటారు. ఇక్కడ ఉన్న గ్రంధాలయం లో ఎన్నో అమూల్యమైన బౌద్ద గ్రంధములు అలాగే పుస్తకాలు భద్రపరచబడినవి. అలాంగ్ కి పశ్చిమాన ఉన్న ఈ ఆశ్రమాన్ని సాంతెం యొంగ్చా అని అంటారు. ఇది అతి పురాతనమైన బౌద్ధ కట్టడాలలో ఒకటి. మెచుక లో అనేకమైన ప్రాచీన విగ్రహాలు కలవు.
చుట్టూ పచ్చటి అందాలతో రమణీయమైన మెచుక సరస్సు ప్రకృతి మాత ఒడిలో సేద దీరె అవకాశం అందిస్తుంది. మెచుకా లోయలలో నుండి సియాం నది ప్రవహిస్తుంది. ఇండియా - చైనా సరిహద్దుకి కేవలం 29 కిలోమీటర్ల దూరం లో మెచుక ఉంది. ఆది తెగ గిరిజనులు లేదా రామో ప్రజలు ఇక్కడ నివసిస్తారు. లిలబారి విమానాశ్రయం ఇక్కడికి సమీపం లో ఉన్న విమానాశ్రయం.