కంపెనీ బాఘ్ పచ్చదనం, ఆకర్షణీయమైన రంగురంగుల పచ్చిక బయళ్ళతో నిండి చుట్టూ పచార్లు చేసే విస్తారమైన చోటు ఉన్న ఒక అందమైన తోట. ఇది అల్వార్ లో దృష్టిని ఆకర్షించే కేంద్రాలలో ఒకటి. ఈ ఉద్యానవనాన్ని శివదాన సింగ్ మహారాజు క్రీ.శ. 1868 లో నిర్మించాడు. దేశపు ఇసుక ప్రాంతంలో ఉన్నఈ పచ్చదనాల సంపదను థార్ ఎడారి మధ్యలోని ఒయాసిస్సు అంటారు.
ఈ అద్భుతమైన తోట ఒక ప్రత్యెక బెంగాలీ తరహలో వంపులు ఉన్న గొడుగులా ఉంటుంది. ఈ అందమైన తోటలో ఒక పెద్ద వంపుకు ప్రసిద్ది చెందిన షిమ్లా హౌజ్ అనే ప్రముఖ నిర్మాణం ఉంది. ఈ నిర్మాణ అద్భుతాన్ని మంగల్ సింగ్ మహారాజు వేసవి విడిదిగా వాడేందుకు క్రీ.శ. 1885 లో కట్టించాడు.