గ్రిష్ నేశ్వర్ అనేది శివుడి జ్యోతిర్లింగం. ప్రఖ్యాత ఈ హిందూ దేవాలయం గ్రుష్మేష్వర్ గా చెపుతారు. ఔరంగాబాద్ లో ఎల్లోరా గుహలకు సమీపంలో కలదు. దీని నిర్మాణ కర్త అహిల్యాభాయ్ హోల్కర్. ఏటా వేలాది భక్తులు దీనిని దర్శిస్తారు. ఈ దేవాలయాన్ని సుమారు 400 సంవత్సరాల క్రిందట ఛత్రపతి శివాజి మహారాజ్ పితామహుడు 16వ శతాబ్దంలో పునరుద్ధరించినట్లు చెపుతారు. ఈ జ్యోతిర్లింగం ఔంధా నాగ్ నాధ్ నుండి తేలికగా చేరవచ్చు. రోడ్డు ద్వారా షుమారు 4 గంటల సమయం ప్రయాణించాలి.